సాదియత్ నుండి అబుదాబి విమానాశ్రయానికి ఉచిత డ్రైవర్లెస్ టాక్సీ సేవలు..!!
- April 18, 2025
యూఏఈ: అబుదాబిలోని ప్రయాణికులు ఇప్పుడు యాస్ ద్వీపంలోని సాదియత్ నుండి డ్రైవర్లెస్ టాక్సీలో జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. మొదటగా యాస్, సాదియత్ దీవులలో ప్రారంభమైన ఈ సేవ, ఇప్పుడు రాజధానిలోని కీలక ప్రదేశానికి చేరుకుంది.
"యాస్ ద్వీపం నుండి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆటోమెటెడ్ వాహన సేవ విస్తరణ అబుదాబి మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అధునాతన సాంకేతికతలను రవాణా వ్యవస్థలో అనుసంధానించడంలో ఇది కీలకంగా మారుతుంది." అని అబుదాబిలోని ఆటోమెటెడ్ వాహన రవాణా సేవ విస్తరణ ఫాతిమా అల్ హంటౌబి అన్నారు.
2021 లో ప్రారంభించినప్పటి నుండి ఆటోమెటెడ్ వాహన సేలలు ఇప్పటివరకు 30వేల ట్రిప్పులను పూర్తి చేసిందని, 430,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని వివరించారు. పైలట్ దశలో భాగంగా భద్రతా నిర్వాహకులు ఉంటారని ఫాతిమా అన్నారు. థాయ్ యాప్ ద్వారా ప్రయాణీకులు రైడ్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. రాజధానిలో ఇప్పుడు దాదాపు 18 ఆటోమెటెడ్ టాక్సీలు పనిచేస్తున్నాయని, ఇవి యాస్ ద్వీపం, సాదియత్ ద్వీపం, ఇప్పుడు జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సేవలను విస్తరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!







