సాదియత్ నుండి అబుదాబి విమానాశ్రయానికి ఉచిత డ్రైవర్లెస్ టాక్సీ సేవలు..!!
- April 18, 2025
యూఏఈ: అబుదాబిలోని ప్రయాణికులు ఇప్పుడు యాస్ ద్వీపంలోని సాదియత్ నుండి డ్రైవర్లెస్ టాక్సీలో జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. మొదటగా యాస్, సాదియత్ దీవులలో ప్రారంభమైన ఈ సేవ, ఇప్పుడు రాజధానిలోని కీలక ప్రదేశానికి చేరుకుంది.
"యాస్ ద్వీపం నుండి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆటోమెటెడ్ వాహన సేవ విస్తరణ అబుదాబి మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అధునాతన సాంకేతికతలను రవాణా వ్యవస్థలో అనుసంధానించడంలో ఇది కీలకంగా మారుతుంది." అని అబుదాబిలోని ఆటోమెటెడ్ వాహన రవాణా సేవ విస్తరణ ఫాతిమా అల్ హంటౌబి అన్నారు.
2021 లో ప్రారంభించినప్పటి నుండి ఆటోమెటెడ్ వాహన సేలలు ఇప్పటివరకు 30వేల ట్రిప్పులను పూర్తి చేసిందని, 430,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని వివరించారు. పైలట్ దశలో భాగంగా భద్రతా నిర్వాహకులు ఉంటారని ఫాతిమా అన్నారు. థాయ్ యాప్ ద్వారా ప్రయాణీకులు రైడ్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. రాజధానిలో ఇప్పుడు దాదాపు 18 ఆటోమెటెడ్ టాక్సీలు పనిచేస్తున్నాయని, ఇవి యాస్ ద్వీపం, సాదియత్ ద్వీపం, ఇప్పుడు జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సేవలను విస్తరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









