సాదియత్ నుండి అబుదాబి విమానాశ్రయానికి ఉచిత డ్రైవర్లెస్ టాక్సీ సేవలు..!!
- April 18, 2025
యూఏఈ: అబుదాబిలోని ప్రయాణికులు ఇప్పుడు యాస్ ద్వీపంలోని సాదియత్ నుండి డ్రైవర్లెస్ టాక్సీలో జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు. మొదటగా యాస్, సాదియత్ దీవులలో ప్రారంభమైన ఈ సేవ, ఇప్పుడు రాజధానిలోని కీలక ప్రదేశానికి చేరుకుంది.
"యాస్ ద్వీపం నుండి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆటోమెటెడ్ వాహన సేవ విస్తరణ అబుదాబి మొబిలిటీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అధునాతన సాంకేతికతలను రవాణా వ్యవస్థలో అనుసంధానించడంలో ఇది కీలకంగా మారుతుంది." అని అబుదాబిలోని ఆటోమెటెడ్ వాహన రవాణా సేవ విస్తరణ ఫాతిమా అల్ హంటౌబి అన్నారు.
2021 లో ప్రారంభించినప్పటి నుండి ఆటోమెటెడ్ వాహన సేలలు ఇప్పటివరకు 30వేల ట్రిప్పులను పూర్తి చేసిందని, 430,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించిందని వివరించారు. పైలట్ దశలో భాగంగా భద్రతా నిర్వాహకులు ఉంటారని ఫాతిమా అన్నారు. థాయ్ యాప్ ద్వారా ప్రయాణీకులు రైడ్లను బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. రాజధానిలో ఇప్పుడు దాదాపు 18 ఆటోమెటెడ్ టాక్సీలు పనిచేస్తున్నాయని, ఇవి యాస్ ద్వీపం, సాదియత్ ద్వీపం, ఇప్పుడు జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సేవలను విస్తరించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









