అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- July 12, 2026
అలులా: సౌదీ అరేబియాలోని చారిత్రక నగరం అలులా(ALULA)లో 2026–2027 'ఖైరాత్ అలులా' వ్యవసాయ సీజన్ ను రాయల్ కమిషన్ ఫర్ అలులా (RCU) ఘనంగా ప్రారంభించింది. వ్యవసాయ రంగ పోటీతత్వాన్ని పెంచడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, రైతులను సాధికారత కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. అలులాలో ప్రస్తుతం 20,500 హెక్టార్లకు పైగా సాగుభూమి ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం సుమారు 1.30 లక్షల టన్నుల ఖర్జూరాలు, 14 వేల టన్నుల సిట్రస్ పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ప్రాంతంలో 4 లక్షలకు పైగా సిట్రస్ చెట్లు ఉన్నాయి.
అలులా ఒయాసిస్లోని 4.2 మిలియన్లకు పైగా ఖర్జూర చెట్లను సర్వే చేసి నమోదు చేయగా, 1.5 మిలియన్లకు పైగా చెట్లను స్మార్ట్ QR కోడ్ ట్రేసబిలిటీ వ్యవస్థలో చేర్చారు. దీని ద్వారా ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయ అవకాశాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2035 నాటికి వ్యవసాయ రంగ స్థూల ఉత్పత్తి విలువను 1.8 బిలియన్ సౌదీ రియాల్స్కు, ఖర్జూరాల అమ్మకాల విలువను 1.507 బిలియన్ రియాల్స్కు పెంచాలని రాయల్ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1.226 బిలియన్ రియాల్స్ విలువైన ఎగుమతులు ఉండేలా ప్రణాళికలు రూపొందించింది.
అలాగే, 7,100 మందికి పైగా రైతులకు సాంకేతిక, వ్యవసాయ, పశువైద్య సేవలు అందించడంతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అలాగే వ్యవసాయ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి 3.34 లక్షల క్యూబిక్ మీటర్ల సేంద్రియ ఎరువును తయారు చేస్తోంది. నీటి వినియోగాన్ని 2035 నాటికి 47 శాతం తగ్గించే లక్ష్యంతో ఆధునిక సాగునీటి వ్యవస్థలు, పర్యవేక్షణ సాంకేతికతలను 4,000 హెక్టార్లకు పైగా విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. 'ఖైరాత్ అలులా' వ్యవసాయ సీజన్ ద్వారా స్థానిక పంటలు, పండ్లను పర్యాటకులకు పరిచయం చేయడంతో పాటు రైతులు, స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ అలులాను సుస్థిర వ్యవసాయ–పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







