యూఏఈ-ఇండియా ఫ్లైట్ స‌ర్వీసులు ఆల‌స్యం..!!

- April 25, 2025 , by Maagulf
యూఏఈ-ఇండియా ఫ్లైట్ స‌ర్వీసులు ఆల‌స్యం..!!

యూఏఈ: పాకిస్తాన్ గురువారం తన గ‌గ‌న‌త‌లాన్ని మూసివేసింది. దాంతో భార‌త విమానయాన సంస్థ‌లు ప్ర‌భావితం అయ్యాయి. పాక్ చ‌ర్య‌ల కార‌ణంగా యూఏఈ, ఇండియా మ‌ధ్య నడిచే ఫ్లైట్స్ ఆల‌స్యం అవుతున్న‌ట్లు ఆయా సంస్థ‌లు ప్ర‌క‌టించాయి.  

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది భారతీయ పర్యాటకులు మరణించిన తరువాత ఇస్లామాబాద్ , న్యూఢిల్లీ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ చర్యతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానయాన కారిడార్లలో ఒకటైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన భారతీయ నగరాలకు దుబాయ్, అబుదాబి, షార్జా నుండి అనేక రోజువారీ విమానాలు పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని ఉప‌యోగిస్తాయి.  ఇప్పుడు మూసివేత అమలులోకి రావడంతో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోతో సహా యూఏఈలో పనిచేస్తున్న భారతీయ విమానయాన సంస్థలు అరేబియా సముద్రం మీదుగా లేదా పొడవైన దక్షిణ మార్గాల ద్వారా వెళ్లవలసి ఉంటుంది. దీనివల్ల రెండు గంటల విమాన ప్రయాణ సమయం పెరుగుతుందని నిపుణులు తెలిపారు.

దుబాయ్‌కు చెందిన ఓరియంట్ ట్రావెల్స్‌లో సేల్స్ మరియు హాలిడేస్ జనరల్ మేనేజర్ వసీం రెహమానీ మాట్లాడుతూ.. రూటింగ్ ప్రధానంగా భారతీయ క్యారియర్‌లను ప్రభావితం చేస్తుందని అన్నారు. ఇంధన ఖర్చులు పెరగడం వల్ల భారతీయ ప్రయాణికులు ఎక్కువ విమాన వ్యవధిని, అధిక‌ ఛార్జీలను ఎదుర్కోవలసి రావచ్చ‌ని తెలిపారు.రాబోయే రోజుల్లో యూఏఈ నుండి భారతదేశానికి ప్రయాణించే ప్రయాణీకులు తాజా అప్డేట్ ల‌ కోసం వారి విమానయాన సంస్థలతో ట‌చ్ లో ఉండాల‌ని సూచించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com