అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- April 26, 2025
యూఏఈ: అబుదాబిలో విషాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం తాను నివసించిన భవనం నుండి పడి 17 ఏళ్ల విద్యార్థి మరణించాడు. అబుదాబి ఇండియన్ స్కూల్లో చదువుతున్న అలెక్స్ బినోయ్ తనుంటున్న భవనం మూడవ అంతస్తు అపార్ట్మెంట్ నుండి పడిపోయాడని అబుదాబికి చెందిన భారతీయ సామాజిక కార్యకర్త వెల్లడించారు. అయితే, భవనం వాచ్మెన్ అప్రమత్తం చేసే వరకు తమ కుమారుడు పడిపోయాడన్న సంగతే తెలియదని బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
ముగ్గురు పిల్లలలో చిన్నవాడు అలెక్స్. తను గ్రేడ్ 12 CBSE బోర్డు పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. అతని తల్లిదండ్రులు, బినోయ్ థామస్, ఎల్సీ బినోయ్ యూఏఈలో చాలా కాలంగా నివసిస్తున్నారు. ఎల్సీ అబుదాబిలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు.
యువకుడి మృతదేహాన్ని శనివారం సాయంత్రం అతని స్వస్థలమైన కేరళకు తీసుకువెళతామని, అక్కడ అతన్ని ఖననం చేస్తామని ఆయన అన్నారు. బాలుడికి ఇద్దరు అన్నలు ఉన్నారు. భారతదేశంలో నివసిస్తున్న డాక్టర్ రాహుల్ బినోయ్ ఒకరు కాగా, మరోకరు పోలాండ్లో పనిచేస్తున్న రోహిత్ బినోయ్. అతని మృతదేహాన్ని ఏప్రిల్ 26, శనివారం రాత్రి 10.40 గంటలకు ఇండియాకు తీసుకెళ్లనున్నారు.
దర్శకుడు కావాలనే ఆకాంక్షతో అలెక్స్ షార్ట్ ఫిల్మ్లు, రీల్స్ తీయడానికి ఇష్టపడేవాడని; మాస్ కమ్యూనికేషన్ అధ్యయనం చేయడానికి బెంగళూరులోని ఒక విశ్వవిద్యాలయంలో ఇప్పటికే అతనికి ప్రవేశం లభించిందని బినోయ్ థామస్ తెలిపారు.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం