పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- March 03, 2026
రియాద్: సౌదీ అరేబియా ప్రాంతాల ఎమిర్ల 33వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. దీనికి అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో భాగంగా పౌరులు, నివాసితులు మరియు సందర్శకుల భద్రతకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించారు.
ప్రస్తుతం ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో భద్రతను బలోపేతం చేయడానికి, రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరినీ రక్షించడానికి మరియు విమానాశ్రయాలలో చిక్కుకున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పౌరులను ఆతిథ్యం ఇవ్వడానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నా.. భద్రతా పరంగా స్థిరంగా ఉందని, రోజువారీ జీవితం సాధారణంగా కొనసాగుతుందని వెల్లడించారు. విజన్ 2030కి అనుగుణంగా మెరుగైన జీవన నాణ్యతకు దోహదపే నివేదికలు మరియు వర్కింగ్ పేపర్లపై సమావేశంలో చర్చించారు.
రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీలను ఉపయోగించడం మరియు ప్రభుత్వ రంగ పనితీరులో రాణించడానికి స్మార్ట్ డిజిటల్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సమీక్షించారు. త్వరలోనే కింగ్ క్రౌన్ ప్రిన్స్కు అనేక సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







