పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- March 03, 2026
రియాద్: సౌదీ అరేబియా ప్రాంతాల ఎమిర్ల 33వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. దీనికి అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో భాగంగా పౌరులు, నివాసితులు మరియు సందర్శకుల భద్రతకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించారు.
ప్రస్తుతం ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో భద్రతను బలోపేతం చేయడానికి, రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరినీ రక్షించడానికి మరియు విమానాశ్రయాలలో చిక్కుకున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పౌరులను ఆతిథ్యం ఇవ్వడానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నా.. భద్రతా పరంగా స్థిరంగా ఉందని, రోజువారీ జీవితం సాధారణంగా కొనసాగుతుందని వెల్లడించారు. విజన్ 2030కి అనుగుణంగా మెరుగైన జీవన నాణ్యతకు దోహదపే నివేదికలు మరియు వర్కింగ్ పేపర్లపై సమావేశంలో చర్చించారు.
రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీలను ఉపయోగించడం మరియు ప్రభుత్వ రంగ పనితీరులో రాణించడానికి స్మార్ట్ డిజిటల్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సమీక్షించారు. త్వరలోనే కింగ్ క్రౌన్ ప్రిన్స్కు అనేక సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









