పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- March 03, 2026
రియాద్: సౌదీ అరేబియా ప్రాంతాల ఎమిర్ల 33వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. దీనికి అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో భాగంగా పౌరులు, నివాసితులు మరియు సందర్శకుల భద్రతకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించారు.
ప్రస్తుతం ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో భద్రతను బలోపేతం చేయడానికి, రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరినీ రక్షించడానికి మరియు విమానాశ్రయాలలో చిక్కుకున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పౌరులను ఆతిథ్యం ఇవ్వడానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నా.. భద్రతా పరంగా స్థిరంగా ఉందని, రోజువారీ జీవితం సాధారణంగా కొనసాగుతుందని వెల్లడించారు. విజన్ 2030కి అనుగుణంగా మెరుగైన జీవన నాణ్యతకు దోహదపే నివేదికలు మరియు వర్కింగ్ పేపర్లపై సమావేశంలో చర్చించారు.
రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీలను ఉపయోగించడం మరియు ప్రభుత్వ రంగ పనితీరులో రాణించడానికి స్మార్ట్ డిజిటల్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సమీక్షించారు. త్వరలోనే కింగ్ క్రౌన్ ప్రిన్స్కు అనేక సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









