ATM 2025.. కొత్త అనుభవాలతో ‘ఎయిర్ ఇండియా’ పెవిలియన్..!!
- April 27, 2025
దుబాయ్: దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో ఏప్రిల్ 28 నుండి మే 1 వరకు జరగనున్న అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) 2025లో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పాల్గొంటుంది. హాల్ 8లోని ఆసియా పెవిలియన్లోని AS7290 మరియు AS7295 బూత్ నంబర్లలో తన ఆధునిక వ్యవస్థలను ప్రదర్శించనున్నారు.
100 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ల సంయుక్త డిజిటల్-ఫస్ట్ విధానంతో రూపొందించబడిన ఈ పెవిలియన్ ఆకర్షణీయమైన వర్చువల్ రియాలిటీ (VR) జోన్ను కలిగి ఉంటుందని ప్రకటించారు. ఇక్కడకు వచ్చే సందర్శకులు ఎయిర్ ఇండియా అత్యాధునిక A350 విమానంలోకి అడుగుపెట్టి దాని ప్రత్యేకతలను స్వయంగా చూసే అవకాశం ఉందన్నారు. అలాగే కొత్తగా అప్గ్రేడ్ చేసిన 787-9 డ్రీమ్లైనర్, A321 క్యాబిన్లను సందర్శించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







