కువైట్ నుండి ఇండియాకు వెళ్తుండగా..కేరళ వాసి మృతి..!!

- April 27, 2025 , by Maagulf
కువైట్ నుండి ఇండియాకు వెళ్తుండగా..కేరళ వాసి మృతి..!!

కువైట్: 32 ఏళ్ల భారతీయుడు అనూప్ బెన్నీ సెలవుల కోసం కువైట్ నుండి భారతదేశంలోని కొచ్చికి వెళ్తుండగా మరణించాడు. విమానంలో అతను అస్వస్థతకు గురికాగా, వైద్య అత్యవసర పరిస్థితి కోసం విమానాన్ని ముంబైకి మళ్లించారు.దురదృష్టవశాత్తు, ఇస్పత్రికి తరలించేలోపే అతను మరణించాడని అధికారులు తెలిపారు.

కేరళలోని కొచ్చికి చెందిన అనూప్ బెన్నీ కువైట్‌లోని ఇండియన్ సెంట్రల్ స్కూల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య అన్సీ శామ్యూల్ అతనితో కలిసి ఉంటున్నారు. వీరికి నవంబర్ 2024లో వివాహం జరిగింది. కువైట్‌లోని సెయింట్ గ్రెగోరియోస్ మహా ఎడవాకలో అనూప్ యాక్టివ్ మెంబర్ గా సేవలు అందిస్తున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com