దుబాయ్ గార్డెన్ గ్లో.. 10 ఏళ్ల తర్వాత మూసివేత..!!
- April 28, 2025
యూఏఈ: యూఏఈలో అత్యంత ప్రధాన ఆకర్షణలలో ఒకటైన దుబాయ్ గార్డెన్ గ్లో.. దాని 10వ సీజన్ను జరుపుకున్న తర్వాత అధికారికంగా దాని తలుపులను మూసివేయనున్నారు. ఈ మేరకు దాని అధికారిక X ఖాతాలో వెల్లడించారు. పార్క్ ను త్వరలో కొత్త ప్రదేశంలో సరికొత్తగా తిరిగి తెరవబడుతుందని తెలిపారు.
2015లో జబీల్ పార్క్లో ప్రారంభించినప్పటి నుండి దుబాయ్ గార్డెన్ గ్లో నివాసితులు, పర్యాటకులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందులోని అద్భుతమైన శిల్పాలు, జీవిత-పరిమాణ యానిమేట్రానిక్ డైనోసార్లు, రీసైకిల్ చేయబడిన పదార్థాలతో తయారు చేయబడిన పర్యావరణ-నేపథ్య కళాఖండాలు అందరిని ఆకట్టుకున్నాయి.
దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్లో భాగంగా థర్మ్ గ్రూప్ సహకారంతో అభివృద్ధి చేస్తున్న థర్మ్ దుబాయ్.. మిడిల్ ఈస్ట్ మొట్టమొదటి వెల్బీయింగ్ రిసార్ట్ గా గుర్తింపు పొందనుంది. 2 బిలియన్ దిర్హామ్ల అంచనా పెట్టుబడితో, ఈ రిసార్ట్ 2028 నాటికి పూర్తి అవుతుందని భావిస్తున్నారు. 500,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో థర్మల్ పూల్స్, 15 వాటర్స్లైడ్లు, మూడు ఎత్తైన జలపాతాలు, మిచెలిన్-స్టార్ చేసిన రెస్టారెంట్, 200 కంటే ఎక్కువ వృక్ష జాతులకు నిలయంగా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ బొటానికల్ గార్డెన్ను ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష