బహ్రెయిన్ లో కార్మికులను సత్కరించిన క్యాపిటల్ గవర్నర్..!!
- May 01, 2025
మానామా: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్యుత్తమ సేవలను అందించిన కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాపిటల్ గవర్నర్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ రషీద్ అల్ ఖలీఫా పాల్గొన్నారు. కార్మికులకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కార్మికుల సేవలను కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక బంధాలను పెంపొందించడానికి, కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలకంగా ఉంటాయని తెలిపారు. గవర్నరేట్ ఉద్యోగుల అంకితభావం, అర్థవంతమైన సహకారాలకు గుర్తింపుగా వారికి మెమోంటోలు అందజేశారు. డిప్యూటీ క్యాపిటల్ గవర్నర్ హసన్ అబ్దుల్లా అల్ మదానీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా బహ్రెయిన్ నిరంతర అభివృద్ధికి కార్మికులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని హెచ్ఈ షేక్ రషీద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







