బహ్రెయిన్ లో కార్మికులను సత్కరించిన క్యాపిటల్ గవర్నర్..!!
- May 01, 2025
మానామా: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్యుత్తమ సేవలను అందించిన కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాపిటల్ గవర్నర్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ రషీద్ అల్ ఖలీఫా పాల్గొన్నారు. కార్మికులకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కార్మికుల సేవలను కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక బంధాలను పెంపొందించడానికి, కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలకంగా ఉంటాయని తెలిపారు. గవర్నరేట్ ఉద్యోగుల అంకితభావం, అర్థవంతమైన సహకారాలకు గుర్తింపుగా వారికి మెమోంటోలు అందజేశారు. డిప్యూటీ క్యాపిటల్ గవర్నర్ హసన్ అబ్దుల్లా అల్ మదానీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా బహ్రెయిన్ నిరంతర అభివృద్ధికి కార్మికులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని హెచ్ఈ షేక్ రషీద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







