బిగ్ టికెట్ డ్రాలో 25 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయుడు..!!
- May 04, 2025
యూఏఈ : భారతదేశంలోని త్రివేండ్రం నివాసి అయిన తాజుదీన్ కుంజు..బిగ్ టికెట్ సిరీస్ 274 డ్రాలో దిర్హాం 25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న తర్వాత తాజా మిలియనీర్ అయ్యాడు. తాజుదీన్ తన విజేత టికెట్ (306638)ను ఏప్రిల్ 18న కొనుగోలు చేశాడు. శుక్రవారం అబుదాబిలో జరిగిన లైవ్ డ్రాలో అతను విజయ్ కూడా నిలిచాడు. కాగా,విజేతను నిర్వాహకులు ఫోన్ ద్వారా సంప్రదించలేకపోయారు.
జాక్పాట్తో పాటు, మరో నలుగురు అదృష్టవంతులు అబ్దుల్ మన్నన్, అక్విలిన్ వెరిటా, మీనా కోషి, సైఫుద్దీన్ కూనారి బిగ్ విన్ కాంటెస్ట్ ద్వారా ఎంపిక అయి లైవ్ డ్రాకు ఆహ్వానించారు. వారిలో ప్రతి ఒక్కరూ నగదు బహుమతులు గెలుచుకున్నారు. బిగ్ టికెట్ ఏప్రిల్ నెలంతా వారానికోసారి ఈ-డ్రాలను నిర్వహించింది.వారి కొనసాగుతున్న ప్రమోషన్లలో భాగంగా ఐదుగురు విజేతలకు ఒక్కొక్కరికి దిర్హామ్స్ 150,000 అందజేసింది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







