బిగ్ టికెట్ డ్రాలో 25 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయుడు..!!
- May 04, 2025
యూఏఈ : భారతదేశంలోని త్రివేండ్రం నివాసి అయిన తాజుదీన్ కుంజు..బిగ్ టికెట్ సిరీస్ 274 డ్రాలో దిర్హాం 25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న తర్వాత తాజా మిలియనీర్ అయ్యాడు. తాజుదీన్ తన విజేత టికెట్ (306638)ను ఏప్రిల్ 18న కొనుగోలు చేశాడు. శుక్రవారం అబుదాబిలో జరిగిన లైవ్ డ్రాలో అతను విజయ్ కూడా నిలిచాడు. కాగా,విజేతను నిర్వాహకులు ఫోన్ ద్వారా సంప్రదించలేకపోయారు.
జాక్పాట్తో పాటు, మరో నలుగురు అదృష్టవంతులు అబ్దుల్ మన్నన్, అక్విలిన్ వెరిటా, మీనా కోషి, సైఫుద్దీన్ కూనారి బిగ్ విన్ కాంటెస్ట్ ద్వారా ఎంపిక అయి లైవ్ డ్రాకు ఆహ్వానించారు. వారిలో ప్రతి ఒక్కరూ నగదు బహుమతులు గెలుచుకున్నారు. బిగ్ టికెట్ ఏప్రిల్ నెలంతా వారానికోసారి ఈ-డ్రాలను నిర్వహించింది.వారి కొనసాగుతున్న ప్రమోషన్లలో భాగంగా ఐదుగురు విజేతలకు ఒక్కొక్కరికి దిర్హామ్స్ 150,000 అందజేసింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్