నిషేధిత మెడిసిన్స్.. ప్రయాణీకుడికి 2 ఏళ్ల జైలుశిక్ష, 100,000 దిర్హామ్ల జరిమానా..!!
- May 04, 2025
దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు 45 ఏళ్ల ఆసియా వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ల జరిమానా విధించింది. అతని లగేజీలో వందలాది నిషేధిత మెడిసిన్స్ గుర్తించడంతో దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు లగేజీ తనిఖీ సమయంలో 480 నిషేధం మెడిసిన్స్ గుర్తించి ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో ఆ వ్యక్తి వద్ద వాటిని కలిగి ఉండటానికి ఎటువంటి వైద్య పత్రాలు లేవని తేలిందని, ఆ వ్యక్తి తన స్వదేశం నుండి యూఏఈలోని వేరే వారికి డెలివరీ చేయడానికి ఆ మందులను తీసుకొచ్చినట్టు తెలిపాడని అధికారులు చెప్పారు. జైలు శిక్ష, జరిమానాతో పాటు, శిక్ష అనుభవించిన తర్వాత ఆ వ్యక్తిని దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. విడుదలైన తర్వాత రెండు సంవత్సరాల పాటు యూఈఈ సెంట్రల్ బ్యాంక్ , అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతరులకు డబ్బును బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయడం కూడా అతనిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









