నిషేధిత మెడిసిన్స్.. ప్రయాణీకుడికి 2 ఏళ్ల జైలుశిక్ష, 100,000 దిర్హామ్ల జరిమానా..!!
- May 04, 2025
దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు 45 ఏళ్ల ఆసియా వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ల జరిమానా విధించింది. అతని లగేజీలో వందలాది నిషేధిత మెడిసిన్స్ గుర్తించడంతో దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు లగేజీ తనిఖీ సమయంలో 480 నిషేధం మెడిసిన్స్ గుర్తించి ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో ఆ వ్యక్తి వద్ద వాటిని కలిగి ఉండటానికి ఎటువంటి వైద్య పత్రాలు లేవని తేలిందని, ఆ వ్యక్తి తన స్వదేశం నుండి యూఏఈలోని వేరే వారికి డెలివరీ చేయడానికి ఆ మందులను తీసుకొచ్చినట్టు తెలిపాడని అధికారులు చెప్పారు. జైలు శిక్ష, జరిమానాతో పాటు, శిక్ష అనుభవించిన తర్వాత ఆ వ్యక్తిని దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. విడుదలైన తర్వాత రెండు సంవత్సరాల పాటు యూఈఈ సెంట్రల్ బ్యాంక్ , అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతరులకు డబ్బును బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయడం కూడా అతనిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







