నిషేధిత మెడిసిన్స్.. ప్రయాణీకుడికి 2 ఏళ్ల జైలుశిక్ష, 100,000 దిర్హామ్ల జరిమానా..!!
- May 04, 2025
దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు 45 ఏళ్ల ఆసియా వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ల జరిమానా విధించింది. అతని లగేజీలో వందలాది నిషేధిత మెడిసిన్స్ గుర్తించడంతో దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు లగేజీ తనిఖీ సమయంలో 480 నిషేధం మెడిసిన్స్ గుర్తించి ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో ఆ వ్యక్తి వద్ద వాటిని కలిగి ఉండటానికి ఎటువంటి వైద్య పత్రాలు లేవని తేలిందని, ఆ వ్యక్తి తన స్వదేశం నుండి యూఏఈలోని వేరే వారికి డెలివరీ చేయడానికి ఆ మందులను తీసుకొచ్చినట్టు తెలిపాడని అధికారులు చెప్పారు. జైలు శిక్ష, జరిమానాతో పాటు, శిక్ష అనుభవించిన తర్వాత ఆ వ్యక్తిని దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. విడుదలైన తర్వాత రెండు సంవత్సరాల పాటు యూఈఈ సెంట్రల్ బ్యాంక్ , అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతరులకు డబ్బును బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయడం కూడా అతనిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్