నిషేధిత మెడిసిన్స్.. ప్రయాణీకుడికి 2 ఏళ్ల జైలుశిక్ష, 100,000 దిర్హామ్ల జరిమానా..!!
- May 04, 2025
దుబాయ్: దుబాయ్ క్రిమినల్ కోర్టు 45 ఏళ్ల ఆసియా వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 100,000 దిర్హామ్ల జరిమానా విధించింది. అతని లగేజీలో వందలాది నిషేధిత మెడిసిన్స్ గుర్తించడంతో దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు లగేజీ తనిఖీ సమయంలో 480 నిషేధం మెడిసిన్స్ గుర్తించి ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో ఆ వ్యక్తి వద్ద వాటిని కలిగి ఉండటానికి ఎటువంటి వైద్య పత్రాలు లేవని తేలిందని, ఆ వ్యక్తి తన స్వదేశం నుండి యూఏఈలోని వేరే వారికి డెలివరీ చేయడానికి ఆ మందులను తీసుకొచ్చినట్టు తెలిపాడని అధికారులు చెప్పారు. జైలు శిక్ష, జరిమానాతో పాటు, శిక్ష అనుభవించిన తర్వాత ఆ వ్యక్తిని దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. విడుదలైన తర్వాత రెండు సంవత్సరాల పాటు యూఈఈ సెంట్రల్ బ్యాంక్ , అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతరులకు డబ్బును బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయడం కూడా అతనిపై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!









