నివాస ప్రాంతాలలో డెలివరీ సైకిళ్ల పర్యవేక్షణకు ప్రతిపాదన..!!

- May 06, 2025 , by Maagulf
నివాస ప్రాంతాలలో డెలివరీ సైకిళ్ల పర్యవేక్షణకు ప్రతిపాదన..!!

మనామా: డెలివరీ కంపెనీలు డెలివరీల కోసం ఉపయోగించే మోటార్ సైకిళ్లపై GPS ట్రాకింగ్ పరికరాలను స్థాపించాలని కోరుతూ నాల్గవ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ దర్రాజ్ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ పరికరాలు అధికారులు వాహనాల స్థానం, వేగాన్ని పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తాయని అన్నారు.  

డెలివరీ మోటార్ సైకిళ్లు తరచుగా ప్రయాణించే అధిక వేగం, ముఖ్యంగా పిల్లలకు తీవ్రమైన భద్రతా ప్రమాదాలను కలిగిస్తుందని నివాసితుల నుండి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో  ఈ మేరకు ప్రతిపాదన చేశారు. 

ఈ ప్రతిపాదనను దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. మునిసిపాలిటీలు, వ్యవసాయ వ్యవహారాల మంత్రికి రిఫర్ చేశారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల సంఖ్యను తగ్గించడం లక్ష్యమని దర్రాజ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com