నివాస ప్రాంతాలలో డెలివరీ సైకిళ్ల పర్యవేక్షణకు ప్రతిపాదన..!!
- May 06, 2025
మనామా: డెలివరీ కంపెనీలు డెలివరీల కోసం ఉపయోగించే మోటార్ సైకిళ్లపై GPS ట్రాకింగ్ పరికరాలను స్థాపించాలని కోరుతూ నాల్గవ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ దర్రాజ్ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ పరికరాలు అధికారులు వాహనాల స్థానం, వేగాన్ని పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తాయని అన్నారు.
డెలివరీ మోటార్ సైకిళ్లు తరచుగా ప్రయాణించే అధిక వేగం, ముఖ్యంగా పిల్లలకు తీవ్రమైన భద్రతా ప్రమాదాలను కలిగిస్తుందని నివాసితుల నుండి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ మేరకు ప్రతిపాదన చేశారు.
ఈ ప్రతిపాదనను దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. మునిసిపాలిటీలు, వ్యవసాయ వ్యవహారాల మంత్రికి రిఫర్ చేశారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల సంఖ్యను తగ్గించడం లక్ష్యమని దర్రాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







