నివాస ప్రాంతాలలో డెలివరీ సైకిళ్ల పర్యవేక్షణకు ప్రతిపాదన..!!
- May 06, 2025
మనామా: డెలివరీ కంపెనీలు డెలివరీల కోసం ఉపయోగించే మోటార్ సైకిళ్లపై GPS ట్రాకింగ్ పరికరాలను స్థాపించాలని కోరుతూ నాల్గవ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ హుస్సేన్ దర్రాజ్ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఈ పరికరాలు అధికారులు వాహనాల స్థానం, వేగాన్ని పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తాయని అన్నారు.
డెలివరీ మోటార్ సైకిళ్లు తరచుగా ప్రయాణించే అధిక వేగం, ముఖ్యంగా పిల్లలకు తీవ్రమైన భద్రతా ప్రమాదాలను కలిగిస్తుందని నివాసితుల నుండి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ మేరకు ప్రతిపాదన చేశారు.
ఈ ప్రతిపాదనను దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. మునిసిపాలిటీలు, వ్యవసాయ వ్యవహారాల మంత్రికి రిఫర్ చేశారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల సంఖ్యను తగ్గించడం లక్ష్యమని దర్రాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!







