ఆన్లైన్లో వ్యక్తిని బెదిరించిన కొడుకు..తండ్రికి Dh3,000 ఫైన్..!!
- May 06, 2025
యూఏఈ: స్నాప్చాట్లో మైనర్ బెదిరించిన తర్వాత, అల్ ఐన్లోని ఒక సివిల్ కోర్టు Dh3,000 పరిహారం చెల్లించాలని మైనర్ సంరక్షకుడిని ఆదేశించింది. స్నాప్చాట్ ద్వారా పంపిన బెదిరింపు సందేశాల వల్ల కలిగే హానిని పేర్కొంటూ, బాధితుడు Dh50,000 నష్టపరిహారం కోరుతూ మైనర్ తండ్రిపై దావా వేశారు. అల్ ఐన్ సివిల్, కమర్షియల్, అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టు పరిస్థితిని అంచనా వేసి, బాధితుడు అనుభవించిన భావోద్వేగ , నైతిక హానికి Dh3,000 పరిహారం అందజేయాలని ఆదేశించింది.
యూఏఈ సివిల్ లావాదేవీల నిబంధనల ప్రకారం.. చట్టవిరుద్ధమైన చర్యల వల్ల కలిగే ఏదైనా నిరూపితమైన హాని బాధితుడికి పరిహారం పొందే హక్కును ఇస్తుందని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. మైనర్ వాస్తవానికి బూతు పదాలను ఉపయోగించాడని, వాదిని పరోక్షంగా బెదిరించి, బాధితుడి ప్రతిష్టకు, మానసికంగా హాని కలిగించాడని పేర్కొంది.
మైనర్లకు సంబంధించిన కేసులలో.. ముఖ్యంగా సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుష్ప్రవర్తనకు సంబంధించిన కేసులలో తల్లిదండ్రులు, సంరక్షకుల జవాబుదారీతనాన్ని ఈ తీర్పు గుర్తుచేసిందని దుబాయ్లో ఉన్న లీగల్ కన్సల్టెంట్ అహ్మద్ రషెద్ అన్నారు. బ్లాక్మెయిల్, ఎలక్ట్రానిక్ బెదిరింపులకు వ్యతిరేకంగా యూఏఈలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని అన్నారు. కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష, Dh250,000 నుండి Dh500,000 వరకు జరిమానాలు విధించే హక్కు కోర్టులకు ఉంటుందన్నారు. ఇలాంటి కేసులలో పరిహారం పొందడంతోపాటు సివిల్ కేసులను కూడా వేసే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం







