బహ్రెయిన్ అంతటా కేపీఏ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవ వేడుకలు..!!
- May 08, 2025
మనామా: కొల్లం ప్రవాసి అసోసియేషన్ (KPA).. బహ్రెయిన్ అంతటా అనేక కార్యక్రమాలతో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంది. సామాజిక బాధ్యత, శ్రామిక శక్తి పట్ల తన అంకితభావాన్ని తెలియజేసింది. మే 1న కింగ్ హమద్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో జరిగిన KPA 17వ ఎడిషన్ “స్నేహస్పర్శం” రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. గురుదేవా సోషల్ సొసైటీ చైర్మన్ సనీష్ కూరుముల్లిల్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. KPA అధ్యక్షుడు అనోజ్ మాస్టర్ అధ్యక్షత వహించారు. ఈ శిబిరాన్ని KPA కేంద్ర,జిల్లా కమిటీలు, దాని మహిళా విభాగం ప్రవాసీ సభ్యులతో కలిసి విజయవంతంగా నిర్వహించారు.
మరో కార్యక్రమంలో, KPA మహిళా విభాగం ప్రవాసీ శ్రీ.. జుర్దాబ్లోని మహిళా కార్మిక శిబిరంలో కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంది. అక్కడ వారు 100 మందికి పైగా మహిళా కార్మికులకు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని KPA కార్యదర్శి అనిల్కుమార్ ప్రారంభించారు. KPA యొక్క హమద్ టౌన్ ఏరియా కమిటీ జర్వాన్ ఫైబర్గ్లాస్ ఫ్యాక్టరీలో వేడుకలను నిర్వహించింది. KPA అధ్యక్షుడు అనోజ్ మాస్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి హమద్ టౌన్ ఏరియా అధ్యక్షురాలు జ్యోతి ప్రమోద్ అధ్యక్షత వహించారు. జనరల్ సెక్రటరీ ప్రశాంత్ ప్రబుధన్ సహా పలువురు కెపిఎ ప్రతినిధులు సభలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









