దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రా..భారతీయ ప్రవాసిని వరించిన $1 మిలియన్..!!
- May 08, 2025
దుబాయ్: అజ్మాన్లో నివసిస్తున్న 52 ఏళ్ల భారతీయుడు వేణుగోపాల్ ముల్లాచేరి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో $1 మిలియన్ గెలుచుకున్నాడు. ఏప్రిల్ 23న టెర్మినల్ 2 అరైవల్ షాపులో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 1163తో సిరీస్ 500 ప్రమోషన్లో అతను 500వ విజేతగా నిలిచాడు. ఒక దశాబ్దానికి పైగా అజ్మాన్లో నివసిస్తున్న ముల్లాచేరి.. అధికారిక దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఫేస్బుక్ పేజీలో ప్రత్యక్ష డ్రాను వీక్షించాడు. తన పేరు ప్రకటించగానే ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు.
ముల్లాచేరి ఇద్దరు పిల్లల తండ్రి. అజ్మాన్లోని ఒక కంపెనీకి IT సపోర్ట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాడు. 15 సంవత్సరాలకు పైగా ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా స్పందిస్తూ.. ‘‘దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్లో 500వ విజేతగా నిలిచినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ ప్రసిద్ధ ప్రమోషన్లో చాలా కాలంగా పాల్గొంటున్న. చివరకు అనేక మంది విజేతలలో ఒకరిగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి చాలా ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు. కేరళకు చెందిన ముల్లాచేరి 1999 నుండి మిలీనియం మిలియనీర్ ప్రమోషన్లో $1 మిలియన్ గెలుచుకున్న 249వ భారతీయుడిగా నిలిచాడు.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కాన్కోర్స్ Bలో వేడుక డ్రా జరిగింది. దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధ్యక్షుడు, దుబాయ్ డ్యూటీ ఫ్రీ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









