భారతీయ ఐటీ కంపెనీలకు రానున్న కష్టకాలం
- July 09, 2016
హెచ్-1బీ, ఎల్1 వీసాల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి, అధిక ఆదాయం పొందుతున్న భారత ఐటీ కంపెనీలకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఇక ఈ వీసాలకు అనుమతి ఇవ్వరాదని డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల ద్వైపాక్షిక సభ్యులు ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలను అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తే భారతీయ ఐటీ కంపెనీలకు శరాఘాతమే. ఇక ఈ వీసాల ద్వారా అమెరికాలో ప్రవేశించటం దాదాపు కష్టమైనట్లే.
ప్రస్తుతం అధిక సంఖ్యలో ఐటీ కంపెనీలు హెచ్-1బీ, ఎల్1 వీసాల మీద ఆధారపడి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వీసాల సంస్కరణలకు న్యూజెర్సీకి చెందిన డెమోక్రాటిక్ సభ్యుడు బిల్ పాస్క్రెల్, కాలిఫోర్నియాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు దానా రోరబాచర్లు ప్రతిపాదించారు. ఇది ఆమోదం పొందితే హెచ్-1బి ద్వారా ఒక కంపెనీలో ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను 50 కంటే ఎక్కువ మందిని లేదా మొత్తంలో 50శాతం మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది.
'అమెరికా మంచి నిపుణులను తయారు చేస్తోంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు కళాశాలల నుంచి వస్తున్నారు. అయితే వారికి ఉపాధి ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీసా సంస్కరణలు అనివార్యం' అని పాస్క్రెల్ ఆవేదన వ్యక్తం చేశారు.
పాస్క్రెల్, దానా రోరబాచర్లు 2010లో ఇలాంటి బిల్లునే ఒకదానిని సభలో ప్రవేశపెట్టారు. అయితే మెజారిటీ సభ్యుల ఆమోదం లేక ఆ బిల్లు వీగిపోయింది. ప్రస్తుతం కూడా ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు సంతకం చేయాలంటే మొదట దీనిని అమెరికన్ సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







