ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తో మాట్లాడిన సుల్తాన్..!!
- May 12, 2025
మస్కట్: ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్.. హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో, ఉద్రిక్తతలను తగ్గించడంలో, స్థిరత్వాన్ని పెంపొందించడంలో సుల్తాన్, ఆయన ప్రభుత్వం పోషించిన కీలక పాత్రకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రశంసలు వ్యక్తం చేశారు.
ఎర్ర సముద్రంలో సముద్ర నావిగేషన్ పునరుద్ధరణకు, సనాలో యునైటెడ్ స్టేట్స్ మరియు యెమెన్ అధికారుల మధ్య శత్రుత్వాలను నిలిపివేయడానికి మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చిన ఒమన్ అంకితభావాన్ని జనరల్ ప్రశంసించారు.
ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య అణు చర్చలకు సంబంధించి ఒమన్ చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!