ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ తో మాట్లాడిన సుల్తాన్..!!
- May 12, 2025
మస్కట్: ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్.. హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో, ఉద్రిక్తతలను తగ్గించడంలో, స్థిరత్వాన్ని పెంపొందించడంలో సుల్తాన్, ఆయన ప్రభుత్వం పోషించిన కీలక పాత్రకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రశంసలు వ్యక్తం చేశారు.
ఎర్ర సముద్రంలో సముద్ర నావిగేషన్ పునరుద్ధరణకు, సనాలో యునైటెడ్ స్టేట్స్ మరియు యెమెన్ అధికారుల మధ్య శత్రుత్వాలను నిలిపివేయడానికి మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చిన ఒమన్ అంకితభావాన్ని జనరల్ ప్రశంసించారు.
ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య అణు చర్చలకు సంబంధించి ఒమన్ చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి







