చైనా విద్యుత్ వస్తువుల పై ఖతార్ డంపింగ్ సుంకాలు..!!
- May 12, 2025
దోహా: జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, స్థానిక ఉత్పత్తులను రక్షించడం కోసం వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. చైనా నుండి ఎగుమతి అవుతున్న 1000 వోల్ట్లకు మించని వోల్టేజ్ కోసం ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు, స్విచ్లు, ప్లగ్లు, సాకెట్లపై డంపింగ్ వ్యతిరేక సుంకాలను విధించాలని నిర్ణయించింది. ఇందులో మార్కెట్ లో స్థిరమైన వాణిజ్య వాతావరణాన్ని పెంపొందించడానికి జాతీయ ఉత్పత్తులకు, జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి హాని చేసే దిగుమతులను నిరోధించడానికి డంపింగ్ సుంకాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. యాంటీ-డంపింగ్ సుంకాలు సెప్టెంబర్ 25, 2029 వరకు విధించబడతాయని స్పష్టం చేసింది. అధికారిక గెజిట్లో ప్రచురించబడిన మరుసటి రోజు నుండి ఇది అమల్లోకి వస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







