చైనా విద్యుత్ వస్తువుల పై ఖతార్ డంపింగ్ సుంకాలు..!!
- May 12, 2025
దోహా: జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, స్థానిక ఉత్పత్తులను రక్షించడం కోసం వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. చైనా నుండి ఎగుమతి అవుతున్న 1000 వోల్ట్లకు మించని వోల్టేజ్ కోసం ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు, స్విచ్లు, ప్లగ్లు, సాకెట్లపై డంపింగ్ వ్యతిరేక సుంకాలను విధించాలని నిర్ణయించింది. ఇందులో మార్కెట్ లో స్థిరమైన వాణిజ్య వాతావరణాన్ని పెంపొందించడానికి జాతీయ ఉత్పత్తులకు, జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి హాని చేసే దిగుమతులను నిరోధించడానికి డంపింగ్ సుంకాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. యాంటీ-డంపింగ్ సుంకాలు సెప్టెంబర్ 25, 2029 వరకు విధించబడతాయని స్పష్టం చేసింది. అధికారిక గెజిట్లో ప్రచురించబడిన మరుసటి రోజు నుండి ఇది అమల్లోకి వస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు









