చైనా విద్యుత్ వస్తువుల పై ఖతార్ డంపింగ్ సుంకాలు..!!
- May 12, 2025
దోహా: జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం, స్థానిక ఉత్పత్తులను రక్షించడం కోసం వాణిజ్య , పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. చైనా నుండి ఎగుమతి అవుతున్న 1000 వోల్ట్లకు మించని వోల్టేజ్ కోసం ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు, స్విచ్లు, ప్లగ్లు, సాకెట్లపై డంపింగ్ వ్యతిరేక సుంకాలను విధించాలని నిర్ణయించింది. ఇందులో మార్కెట్ లో స్థిరమైన వాణిజ్య వాతావరణాన్ని పెంపొందించడానికి జాతీయ ఉత్పత్తులకు, జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి హాని చేసే దిగుమతులను నిరోధించడానికి డంపింగ్ సుంకాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. యాంటీ-డంపింగ్ సుంకాలు సెప్టెంబర్ 25, 2029 వరకు విధించబడతాయని స్పష్టం చేసింది. అధికారిక గెజిట్లో ప్రచురించబడిన మరుసటి రోజు నుండి ఇది అమల్లోకి వస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









