ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని..

- July 10, 2016 , by Maagulf
ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని..

ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ టాంజానియా చేరుకున్నారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో ప్రసంగం ముగించుకున్న అనంతరం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాంజానియాలోని జూలియన్‌ నైరెరె ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి.. ఆ దేశ ప్రధాని కసీమ్‌ మజలివా సాదరస్వాగతం పలికారు. టాంజానియా సంప్రదాయ నృత్యాలతో మోదీని స్వాగతించారు అక్కడి ప్రజలు.పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జాన్‌ మగుఫులితో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేయనున్నారు. టాంజానియాలో నివసిస్తున్న భారతీయులను మోదీ కలవనున్నారు. అక్కడి నుంచి మోదీ.. కెన్యా బయలుదేరుతారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com