స్లీపర్ బస్సులో మంటలు–ఐదుగురు సజీవదహనం
- May 15, 2025
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నో కిసాన్పాత్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దరాయప్తు చేస్తున్నారు.
అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మంటలు రావడానికి కారణం ఏంటో ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉన్న సమాచారం. ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా.. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వేకువ జామున 5గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









