యూఏఈలో ట్రంప్: $14.5 బిలియన్ల బోయింగ్-GE ఒప్పందం..!!
- May 16, 2025
యూఏఈ: ట్రంప్ తన మూడు దేశాల గల్ఫ్ పర్యటనలో భాగంగా గురువారం యూఏఈకి చేరుకున్నారు. ఎమిరేట్స్కు వెళ్లిన రెండవ అమెరికా అధ్యక్షుడిగా గుర్తింపు పొందారు. ఆయన వచ్చిన తర్వాత అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును సందర్శించి, ఆపై అధ్యక్ష భవనం కస్ర్ అల్ వతన్కు వెళ్లారు. యూఏఈ రాబోయే దశాబ్దంలో యుఎస్లో $1.4 ట్రిలియన్లు పెట్టుబడి పెట్టే ప్రణాళికలను ప్రకటించింది. ఈ ప్రాంతం నుండి యుఎస్ $4 ట్రిలియన్ల వరకు పెట్టుబడులను సేకరించవచ్చని ఆయన చెప్పారు.
ఎతిహాద్ $14.5 బిలియన్ల బోయింగ్ ఒప్పందం
బోయింగ్, GE ఏరోస్పేస్ GE ఇంజిన్లతో నడిచే 28 బోయింగ్ విమానాలను.. ముఖ్యంగా 787, 777X - కొనుగోలు చేయడానికి ఎతిహాద్ నుండి $14.5 బిలియన్ల ఆర్డర్లు చేసినట్లు వైట్ హౌస్ ధృవీకరించింది. ఈ ప్రకటన యూఎస్-యూఏఈ మధ్య $200 బిలియన్లకు పైగా వాణిజ్య ఒప్పందాలలో ఇది భాగమని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం వెల్లడించారు.
"తదుపరి తరం 777X ను దాని విమానాల ప్రణాళికలో చేర్చడంతో, యూఏఈ- యునైటెడ్ స్టేట్స్ మధ్య దీర్ఘకాలిక వాణిజ్య విమానయాన భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుంది. అమెరికన్ తయారీకి ఇది దోహదం చేస్తుంది." అని వైట్ హౌస్ తెలిపింది.
ఎతిహాద్ CEO ఆంటోనోల్డో నెవ్స్ గత నెలలో మాట్లాడుతూ.. 2030 నాటికి తన విమానాల సంఖ్యను 170 కంటే ఎక్కువ విమానాలకు విస్తరించాలని, అబుదాబి ఆర్థిక వైవిధ్యీకరణ వ్యూహాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, ఈ సంవత్సరం 20 నుండి 22 కొత్త విమానాలను జోడించాలని ఎతిహాద్ ప్రణాళిక వేసిందని చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







