అమర్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న 150 మంది తెలుగు యాత్రికులు

- July 10, 2016 , by Maagulf
అమర్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న 150 మంది తెలుగు యాత్రికులు

అమర్‌నాథ్ యాత్రలో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. యాత్ర నుంచి తిరుగు ప్రయాణంలో బాల్తాల్ వద్ద 150 మంది యాత్రీకులు చిక్కుకుపోయినట్లు సమాచారం. అయితే... వీరంతా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించారు. కాగా... విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఈ విషయం తెలవడంతో ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. వారు సురక్షితంగా రాష్ట్రానికి తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు యాత్రికులతో ఫోన్‌లో మాట్లాడారు. యాత్రికులను క్షేమంగా తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని ఢీల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ అధికారి శ్రీకాంత్‌ను మంత్రి రాఘవరావు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com