నిషేధిత పిల్స్ రవాణా.. ఇద్దరికి 200,000 దిర్హామ్ల జరిమానా, 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- May 17, 2025
యూఏఈ: 1,200 నిషేధిత మాదకద్రవ్య పిల్స్ ను యూఏఈలోకి అక్రమ రవాణా చేసినందుకు ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 200,000 దిర్హామ్ల జరిమానా విధించారు. దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కూడా శిక్ష అనుభవించిన తర్వాత ఇద్దరిని (ఒక పురుషుడు, ఒక స్త్రీ) బహిష్కరించాలని ఆదేశించింది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ రొటీన్ స్క్రీనింగ్ సమయంలో ప్రయాణీకుల లగేజీలో అనుమానిత పదార్థాలను గుర్తించి కేసు నమోదు చేసారు. మాన్యువల్ సెర్చ్ లో నియంత్రిత మాదకద్రవ్యాలుగా అనుమానించిన పిల్స్ పెద్ద మొత్తంలో బయటపడ్డాయి.
దుబాయ్ పోలీసులు ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో.. తన స్వదేశంలో ఒక వ్యక్తి బ్యాగ్ను తనకు ఇచ్చాడని, విమానాశ్రయంలో వేచి ఉన్న ఒక మహిళకు డెలివరీ చేయాలని చెప్పారని, అందులో ఆహార పదార్థాలు ఉన్నాయని వాళ్లు చెప్పారని తెలిపాడు. రెండవ నిందితురాలితో జరిపిన వాట్సాప్ మెసేజులను కూడా అతను చూపించాడు.
ఈ సమాచారం ఆధారంగా అధికారులు ఆ మహిళ అరెస్టు చేశారు. ఆమె తన సోదరుడి తరపున బ్యాగ్ను తీసుకోవడానికి విమానాశ్రయంలో ఉన్నట్లు ఒప్పుకుంది. కానీ దానిలోని పిల్స్ గురించి తనకు తెలియదని నిరాకరించింది.
స్వాధీనం చేసుకున్న మాత్రలను యూఏఈ మాదకద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం.. నియంత్రిత పదార్థాలుగా వర్గీకరించారని ఫోరెన్సిక్ విశ్లేషణ నిర్ధారించింది. నిషేధిత పిల్స్ ను పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో దిగుమతి చేసుకుని, కలిగి ఉన్నందుకు నిందితులిద్దరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







