ఎన్టీఆర్తో నటించిన ఉమా భారతి తెలుగు ప్రజలందరికీ ప్రీతిపాత్రురాలు
- May 20, 2025
హైదరాబాద్: యమగోల సినిమాలో మహానటుడు నందమూరి తారక రామారావు సరసన పాటలో నటించిన ఉమా భారతిని, తెలుగువారు ఎంతో అభిమానంతో గుర్తుచేసుకుంటున్నారు. ఆమె అమెరికాలో స్థిరపడ్డప్పటికీ, తెలుగువారి మధురస్మృతుల్లో నిలిచిపోయారు. ఉమా భారతి గురించి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి ప్రశంసలు గుప్పించారు.
రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వంశీ ఇంటర్నేషనల్, జె.వి. ప్రచురణలు నిర్వహించిన సభలో, సినీనటి, నృత్యగురువు, రచయిత్రి కోసూరి ఉమా భారతికి "వంశీ ఎన్టీఆర్ ప్రవాస భారతీయ పురస్కారం" అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వేణుగోపాలాచారి ఈ పురస్కారాన్ని బహూకరించి, విదేశాలలో స్థిరపడినప్పటికీ ఉమా భారతి తెలుగు భాషా, సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని ప్రశంసించారు.
రామరాజు ఎన్టీఆర్ పేరిట పురస్కారానికి ఉమా భారతిని ఎంపిక చేయడం సముచితమని ఆయన పేర్కొన్నారు.
ఉమా భారతి రచించిన హృదయ గానం నవలపై మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ విజయ్ బాబు – ఆమె తేటతెలుగు భాషలో హృదయాన్ని స్పృశించే భావాలను రాగరంజితంగా ఆవిష్కరించారని అన్నారు.
నాట్య భారతీయం అంశాన్ని విశ్లేషించిన ప్రముఖ రచయిత్రి సమ్మెట్ విజయ–నాట్యం, సాహిత్యం, నటన మూడు రంగాల్లోని అనుభవాలతో ఉమా భారతి "భావ కదంబం"గా నిలిచారని వివరించారు.
సంతోష్ బాబు ఉమా భారతి రచించిన కథలు సుందరీ, నాగమణి, హృదయ గానం సంపుటులను విశ్లేషించారు. సభకు వంశీ రామరాజు అధ్యక్షత వహించగా, జ్యోతి వల్కభోజ్యుల కార్యక్రమ నిర్వహణ చేపట్టారు.
తాజా వార్తలు
- టీవీకే ఆధిక్యం.. విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!









