దుబాయ్ బర్షాలో రెండో ఫైర్ యాక్సిడెంట్..
- May 23, 2025
దుబాయ్: దుబాయ్ బర్షాలో రెండో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వరుస ప్రమాదాలతో ప్రజలు భయంతో వణికిపోయారు. గురువారం మధ్యాహ్నం అల్ బర్షా 1లోని ఒక రెస్టారెంట్లో చెలరేగిన మంటలను సకాలంలో ఫైర్ ఫైటర్స్ అదుపులోకి తెచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. "నేను నిద్రపోతున్నప్పుడు నా ఫ్లాట్ మేట్ నన్ను నిద్ర లేపి భవనంలో మంటలు చెలరేగుతున్నాయని చెప్పాడు. నేను లేచి చూసేసరికి జనం బయటకు పరుగెత్తుకుంటూ వస్తున్నట్లు చూశాను." అని ఒక అద్దెదారుడు చెప్పాడు. "నేను బయటకు అడుగు పెట్టినప్పుడు, దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూశాను. జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు కూడా ఉన్నారు.” అని తన అనుభవాన్ని వివరించారు.
ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశం నుండి దాదాపు 500 మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. మే 13న, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ సమీపంలోని బర్షా 1లోని హలీమ్ స్ట్రీట్లోని అల్ జరూని భవనంలో మంటలు చెలరేగాయి . ఆ మంటలు కూడా 13 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్ నుండే వచ్చాయి. వరుస ఫైర్ యాక్సిడెంట్ లు ఆందోళన కలిగిస్తుందని ప్రజలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









