సౌదీ వ్యాపారవేత్తలతో కిర్గిజ్ అధ్యక్షుడు భేటీ..!!
- May 23, 2025
బిష్కెక్: కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్.. కిర్గిజ్ రాజధాని బిష్కెక్లోని అధ్యక్ష కార్యాలయంలో సౌదీ ఛాంబర్స్ సమాఖ్య (FSC) చైర్మన్ హసన్ అల్వైజీ, సౌదీ పెట్టుబడిదారులు ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. అంతకుముందు FSC ప్రతినిధి బృందం కిర్గిజ్స్తాన్లో రెండు రోజులపాటు పర్యటించింది. ఈ సందర్భంగా ఆర్థిక, పెట్టుబడి వాతావరణాన్ని జపరోవ్ హైలైట్ చేశారు. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యాటకం, మైనింగ్ రంగాలలో అందుబాటులో ఉన్న విస్తారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాగా,కిర్గిజ్స్తాన్లో పెట్టుబడి పెట్టడానికి సౌదీ వ్యాపార రంగం సంసిద్ధతను అల్వైజీ ధృవీకరించారు. అలాగే, రెండు దేశాల పెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి కిర్గిజ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో భాగస్వాములతో కలిసి పనిచేయడానికి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







