సౌదీ వ్యాపారవేత్తలతో కిర్గిజ్ అధ్యక్షుడు భేటీ..!!
- May 23, 2025
బిష్కెక్: కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్.. కిర్గిజ్ రాజధాని బిష్కెక్లోని అధ్యక్ష కార్యాలయంలో సౌదీ ఛాంబర్స్ సమాఖ్య (FSC) చైర్మన్ హసన్ అల్వైజీ, సౌదీ పెట్టుబడిదారులు ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. అంతకుముందు FSC ప్రతినిధి బృందం కిర్గిజ్స్తాన్లో రెండు రోజులపాటు పర్యటించింది. ఈ సందర్భంగా ఆర్థిక, పెట్టుబడి వాతావరణాన్ని జపరోవ్ హైలైట్ చేశారు. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యాటకం, మైనింగ్ రంగాలలో అందుబాటులో ఉన్న విస్తారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాగా,కిర్గిజ్స్తాన్లో పెట్టుబడి పెట్టడానికి సౌదీ వ్యాపార రంగం సంసిద్ధతను అల్వైజీ ధృవీకరించారు. అలాగే, రెండు దేశాల పెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి కిర్గిజ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో భాగస్వాములతో కలిసి పనిచేయడానికి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









