100 మిలియన్ దిర్హామ్ల ఎమిరేట్స్ లాటరీ: జాక్పాట్ కొట్టిన రిటైర్డ్ ఇండియన్ ఇంజనీర్..!!
- May 23, 2025
యూఏఈ: ఇండియాలో నివసిస్తున్న రిటైర్డ్ ఇంజనీర్ శ్రీరామ్ రాజగోపాలన్.. ఎమిరేట్స్ డ్రా $27 మిలియన్ల (100 మిలియన్ దిర్హామ్లు) జాక్పాట్ను గెలుచుకున్నట్లు లాటరీ ఆపరేటర్ ప్రకటించారు. శ్రీరామ్ MEGA7 గేమ్లోని ఏడు సంఖ్యలను సరిపోల్చారని, డ్రా చరిత్రలో అతిపెద్ద వ్యక్తిగత బహుమతిని అందుకోనున్నట్టు తెలిపారు.
"నేను మొదట నమ్మలేదు. నేను డ్రా వీడియోను రీప్లే చేసాను. గెలిచిన సంఖ్యల స్క్రీన్షాట్ కూడా తీసుకున్నాను." అని అతను చెప్పారు.
నిరాడంబరమైన, మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన శ్రీరామ్ 1998లో సౌదీ అరేబియాకు వెళ్లారు. 2023లో పదవీ విరమణ చేసిన తర్వాత చెన్నైకి తిరిగి వచ్చేసారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నట్టు పేర్కొన్నారు.
"ఇది చాలా పెద్ద మొత్తం. నేను ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ సాధించలేదు. ఈ విజయం నాకే కాదు. ఇది నా కుటుంబానికి, నా పిల్లలకు చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఆశ. ప్రతి తండ్రి తమ పిల్లల భవిష్యత్తును భద్రపరచాలని కలలు కంటాడు. ఇప్పుడు నేను చేయగలను. తరతరాలుగా సంపదను నిర్మించుకోవడానికి ఇది ఒక అవకాశం." అని వివరించారు. అయితే, కొంత భాగాన్ని ఛారిటీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







