100 మిలియన్ దిర్హామ్ల ఎమిరేట్స్ లాటరీ: జాక్పాట్ కొట్టిన రిటైర్డ్ ఇండియన్ ఇంజనీర్..!!
- May 23, 2025
యూఏఈ: ఇండియాలో నివసిస్తున్న రిటైర్డ్ ఇంజనీర్ శ్రీరామ్ రాజగోపాలన్.. ఎమిరేట్స్ డ్రా $27 మిలియన్ల (100 మిలియన్ దిర్హామ్లు) జాక్పాట్ను గెలుచుకున్నట్లు లాటరీ ఆపరేటర్ ప్రకటించారు. శ్రీరామ్ MEGA7 గేమ్లోని ఏడు సంఖ్యలను సరిపోల్చారని, డ్రా చరిత్రలో అతిపెద్ద వ్యక్తిగత బహుమతిని అందుకోనున్నట్టు తెలిపారు.
"నేను మొదట నమ్మలేదు. నేను డ్రా వీడియోను రీప్లే చేసాను. గెలిచిన సంఖ్యల స్క్రీన్షాట్ కూడా తీసుకున్నాను." అని అతను చెప్పారు.
నిరాడంబరమైన, మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన శ్రీరామ్ 1998లో సౌదీ అరేబియాకు వెళ్లారు. 2023లో పదవీ విరమణ చేసిన తర్వాత చెన్నైకి తిరిగి వచ్చేసారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నట్టు పేర్కొన్నారు.
"ఇది చాలా పెద్ద మొత్తం. నేను ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ సాధించలేదు. ఈ విజయం నాకే కాదు. ఇది నా కుటుంబానికి, నా పిల్లలకు చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఆశ. ప్రతి తండ్రి తమ పిల్లల భవిష్యత్తును భద్రపరచాలని కలలు కంటాడు. ఇప్పుడు నేను చేయగలను. తరతరాలుగా సంపదను నిర్మించుకోవడానికి ఇది ఒక అవకాశం." అని వివరించారు. అయితే, కొంత భాగాన్ని ఛారిటీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!