ఆపరేషన్ సిందూర్ విషయంలో మోదీకి రాహుల్ గాంధీ ప్రశ్నలు

- May 23, 2025 , by Maagulf
ఆపరేషన్ సిందూర్ విషయంలో మోదీకి రాహుల్ గాంధీ ప్రశ్నలు

న్యూ ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ విషయంలో ఇటీవల అనేక ప్రశ్నలు, అనుమానాలను లేవనెత్తుతున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మరోసారి ప్రధాని మోదీ, కేంద్రమంత్రి జైశంకర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు, ప్రశ్నలు సంధించారు. ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయడానికి అంగీకరించడంతో భారత ప్రతిష్ట విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీపడ్డారని ఆరోపించారు. అదే సమయంలో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. కెమెరాల ముందు మాత్రమే ప్రధాని మోదీ రక్తం ఎందుకు మరుగుతుందని ప్రశ్నించారు. అదే సమయంలో భారత విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆరోపించారు. అదే సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎవరు అడిగారని నిలదీశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com