సౌదీ అరేబియాలో SR74 బిలియన్లకు పెరిగిన దిగుమతులు..!!
- June 02, 2025
రియాద్: సౌదీ అరేబియా వస్తువుల దిగుమతులు మార్చిలో స్వల్పంగా పెరిగి SR74 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది 2024లో ఇదే కాలంతో పోలిస్తే 0.1 శాతం పెరుగుదల అని జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) విడుదల చేసిన డేటా తెలిపింది. వస్తువుల దిగుమతులు సుమారు SR 1.65 బిలియన్లు పెరిగాని, ఇది రెండు శాతానికి సమానమని వెల్లడించింది.
మార్చి నెలలో మొత్తం దిగుమతుల్లో యంత్రాలు, యాంత్రిక పరికరాలు, విద్యుత్ పరికరాలు , వాటి విడిభాగాలు 26 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వీటి విలువ SR19.3 బిలియన్లు. వాహనాలు, విమానాలు, ఓడలు, రవాణా పరికరాలు సుమారు 15 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
మార్చిలో సౌదీ అరేబియా మొత్తం దిగుమతుల్లో చైనా వాటా 25 శాతం. దీని విలువ 18.7 బిలియన్ సౌదీ రియాల్. ఆ తర్వాతి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ 5.8 బిలియన్ సౌదీ రియాల్, యూఏఈ 4.4 బిలియన్ సౌదీ రియాల్ ఉన్నాయి. మొత్తం దిగుమతుల్లో దాదాపు 65 శాతం వాటా కలిగి ఉన్న టాప్ 10 దేశాలు., ఇది 48.1 బిలియన్ సౌదీ రియాల్ కు సమానంగా ఉన్నాయి.
గృహనిర్మాణం, నీరు, విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధనాల పెరుగుదల ఈ వార్షిక ధరల పెరుగుదలకు కారణమని అథారిటీ పేర్కొంది. ఇది అత్యధికంగా 6.8 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఫుడ్, పానీయాల ధరలలో 2.2 శాతం పెరుగుదల.. వివిధ వ్యక్తిగత వస్తువులు, సేవల ధరలలో 3.5 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో ఫర్నిచర్ , గృహోపకరణాల ధరలు 1.8 శాతం తగ్గాయి. కమ్యూనికేషన్ ధరలు 1.5 శాతం తగ్గాయి,. పాదరక్షల ధరలు 1.2 శాతం తగ్గాయి. రవాణా 1.0 శాతం తగ్గింది. ఆరోగ్యం, వినోదం, సంస్కృతి ధరలు కూడా వరుసగా 0.2 శాతం నుంచి 0.7 శాతం తగ్గాయి. దీనికి విరుద్ధంగా పొగాకు రంగం 0.1 శాతం స్వల్ప పెరుగుదలను నమోదు చేసిందని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







