రెస్టారెంట్లోకి ప్రవేశించిన ఆరుగురు ప్రవాసులపై బహిష్కరణ వేటు..!!
- June 03, 2025
కువైట్: జులీబ్ అల్-షుయౌఖ్లో గతంలో సీజ్ చేసిన ఒక రెస్టారెంట్ను తెరిచిన కేసులో ఆరుగురు ప్రవాసులపై చర్యలు తీసుకున్నారు. వారిని బహిష్కరించినట్ల పేర్కొన్నారు. దీనిని గతంలో కువైట్ అగ్నిమాపక దళం సీలు చేసింది. మూసివేయబడిన రెస్టారెంట్ను చట్టవిరుద్ధంగా తిరిగి తెరిచారని నివేదిక అందిన తర్వాత రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగం అధికారులు వారిని అరెస్టు చేశారు. వారు వెనుక తలుపు ద్వారా ప్రవేశించి, రెస్టారెంట్ నుండి తమ వస్తువులను బయటకు తీసినట్లు గుర్తించారు.
అయితే, మూసివేసిన ఏదైనా ప్రాంగణంలోకి, ఎలా దేనికోసం ప్రవేశించినా, అది చట్టపరమైన ఉల్లంఘన అని అధికారులు చెప్పారు. ఏదైనా ఎంట్రీ పాయింట్ ద్వారా మూసివేత ఆదేశాలను దాటవేయడం ఖచ్చితంగా నిషేధించబడిందని అగ్నిమాపక దళ ప్రతినిధి ధృవీకరించారు. కువైట్ నిబంధనల ప్రకారం.. అటువంటి ఆదేశాలను ఉల్లంఘించే ప్రవాసులు బహిష్కరించబడతారని, అయితే కువైట్ పౌరులు, ఇందులో పాల్గొంటే, చట్టపరమైన చర్యల కోసం కోర్టులకు రిఫర్ చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







