రెస్టారెంట్లోకి ప్రవేశించిన ఆరుగురు ప్రవాసులపై బహిష్కరణ వేటు..!!
- June 03, 2025
కువైట్: జులీబ్ అల్-షుయౌఖ్లో గతంలో సీజ్ చేసిన ఒక రెస్టారెంట్ను తెరిచిన కేసులో ఆరుగురు ప్రవాసులపై చర్యలు తీసుకున్నారు. వారిని బహిష్కరించినట్ల పేర్కొన్నారు. దీనిని గతంలో కువైట్ అగ్నిమాపక దళం సీలు చేసింది. మూసివేయబడిన రెస్టారెంట్ను చట్టవిరుద్ధంగా తిరిగి తెరిచారని నివేదిక అందిన తర్వాత రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగం అధికారులు వారిని అరెస్టు చేశారు. వారు వెనుక తలుపు ద్వారా ప్రవేశించి, రెస్టారెంట్ నుండి తమ వస్తువులను బయటకు తీసినట్లు గుర్తించారు.
అయితే, మూసివేసిన ఏదైనా ప్రాంగణంలోకి, ఎలా దేనికోసం ప్రవేశించినా, అది చట్టపరమైన ఉల్లంఘన అని అధికారులు చెప్పారు. ఏదైనా ఎంట్రీ పాయింట్ ద్వారా మూసివేత ఆదేశాలను దాటవేయడం ఖచ్చితంగా నిషేధించబడిందని అగ్నిమాపక దళ ప్రతినిధి ధృవీకరించారు. కువైట్ నిబంధనల ప్రకారం.. అటువంటి ఆదేశాలను ఉల్లంఘించే ప్రవాసులు బహిష్కరించబడతారని, అయితే కువైట్ పౌరులు, ఇందులో పాల్గొంటే, చట్టపరమైన చర్యల కోసం కోర్టులకు రిఫర్ చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









