2018 నాటికి బందర్ పూర్తిచేస్తాం: కొల్లు రవీంద్ర
- July 12, 2016
2018 నాటికి బందరు పోర్టు నుంచి మొదటి షిప్ను నడుపుతామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన..ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసే ఆరోపణలు వింతగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్, వైసీపీ నేతల వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ అభివృద్ధిని చూడలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పోర్టు భూసమీకరణపై విపక్షాలు అవవసర రాద్ధాంతం చేయడం సబబు కాదన్నారు. వైఎస్ హయాంలో మూడున్నర లక్షల ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. భూసంతర్పణలో కీలకపాత్ర పోషించిన ధర్మాన ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం కాంగ్రెస్కు ఇష్టం లేదు..ఉనికి కోసమే రైతులను రెచ్చగొడుతున్నాయని...వాటన్నింటి మానుకోని రాష్ట్రాభివృద్ధికై కలిసి రావాలని కొల్లు రవీంద్ర సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







