16న అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశానికి పిలుపునిచ్చిన మోడీ
- July 12, 2016
రాష్ట్రాల మధ్య సఖ్యత, అంతర్గత రక్షణ, ఆర్థిక, సామాజిక ప్రణాళికల గురించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై 16న సమావేశం నిర్వహించనున్నారు. పది సంవత్సరాల విరామం తర్వాత జరగనున్న 11వ అంతర్రాష్ట్ర సదస్సులో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు.
పాఠశాల విద్య, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, ఆధార్ కార్డు, గుడ్ గవర్నెన్స్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కేంద్ర మంత్రులు రాజ్నాథ్సింగ్ , సుష్మాస్వరాజ్, అరుణ్జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, మనోహర్పారికర్ ఈ కౌన్సిల్లో నామినేటెడ్ సభ్యులుగా ఉంటారు. మరో 11 మంది కేంద్రమంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
కశ్మీర్ సంక్షోభం నేపథ్యంలో జరుగుతున్న సమావేశానికి గట్టి భద్రత కల్పించనున్నారు. చివరిసారిగా 2006లో యూపీఏ హయాంలో సమావేశం జరిగింది. పదేళ్ల యూపీఏ పదవీకాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఇలాంటి సమావేశాలు జరిగాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి కౌన్సిల్ తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







