16న అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశానికి పిలుపునిచ్చిన మోడీ

- July 12, 2016 , by Maagulf
16న అన్ని రాష్ట్రాల సీఎంల సమావేశానికి పిలుపునిచ్చిన మోడీ

రాష్ట్రాల మధ్య సఖ్యత, అంతర్గత రక్షణ, ఆర్థిక, సామాజిక ప్రణాళికల గురించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై 16న సమావేశం నిర్వహించనున్నారు. పది సంవత్సరాల విరామం తర్వాత జరగనున్న 11వ అంతర్రాష్ట్ర సదస్సులో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు.
పాఠశాల విద్య, ప్రత్యక్ష నగదు బదిలీ పథకం, ఆధార్‌ కార్డు, గుడ్‌ గవర్నెన్స్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌ , సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్‌ గడ్కరీ, మనోహర్‌పారికర్‌ ఈ కౌన్సిల్‌లో నామినేటెడ్‌ సభ్యులుగా ఉంటారు. మరో 11 మంది కేంద్రమంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
కశ్మీర్‌ సంక్షోభం నేపథ్యంలో జరుగుతున్న సమావేశానికి గట్టి భద్రత కల్పించనున్నారు. చివరిసారిగా 2006లో యూపీఏ హయాంలో సమావేశం జరిగింది. పదేళ్ల యూపీఏ పదవీకాలంలో కేవలం రెండుసార్లు మాత్రమే ఇలాంటి సమావేశాలు జరిగాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి కౌన్సిల్‌ తోడ్పడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com