చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఆంధ్రాకు పెట్టుబడులు

- July 12, 2016 , by Maagulf
చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఆంధ్రాకు పెట్టుబడులు

పెట్టుబడులే లక్ష్యంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఫలితాన్నిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఏపీ బాటపడుతున్నారు. ఇవాళ.. చైనా బృందంతో ఏపీకి చెందిన కేంద్రమంత్రులు అశోకగజపతిరాజు, సుజనాచౌదరి సమావేశమయ్యారు. అమరావతిలో పారిశ్రామిక జోన్‌, హైస్పీడ్‌ రైలు కనెక్టవిటీపై నిశితంగా చర్చించారు. ఏపీలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. సీఎం చంద్రబాబుతో మరోసారి చర్చించి పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని చైనా బృందం మంత్రులకు చెప్పింది. కాగా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన చైనా కంపెనీల ప్రతినిధులకు కేంద్ర మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు రష్యా టూర్ ముగించుకుని వచ్చిన తరువాత మరోసారి ఏపీలో పర్యటిస్తామని చైనా బృందం మంత్రులతో చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com