చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఆంధ్రాకు పెట్టుబడులు
- July 12, 2016
పెట్టుబడులే లక్ష్యంగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు ఫలితాన్నిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఏపీ బాటపడుతున్నారు. ఇవాళ.. చైనా బృందంతో ఏపీకి చెందిన కేంద్రమంత్రులు అశోకగజపతిరాజు, సుజనాచౌదరి సమావేశమయ్యారు. అమరావతిలో పారిశ్రామిక జోన్, హైస్పీడ్ రైలు కనెక్టవిటీపై నిశితంగా చర్చించారు. ఏపీలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. సీఎం చంద్రబాబుతో మరోసారి చర్చించి పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని చైనా బృందం మంత్రులకు చెప్పింది. కాగా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన చైనా కంపెనీల ప్రతినిధులకు కేంద్ర మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు రష్యా టూర్ ముగించుకుని వచ్చిన తరువాత మరోసారి ఏపీలో పర్యటిస్తామని చైనా బృందం మంత్రులతో చెప్పింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







