ప్రొ కబడ్డీలో బెంగళూరుపై గెలిచిన తెలుగు టైటాన్స్
- July 12, 2016
ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా బెంగళూరు బుల్స్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 8 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే బెంగళూరు డిఫెండర్లపై టైటాన్స్ కెప్టెన్ రాహుల్ చౌదరి వరుస రైడ్లతో ఎదురుదాడి చేయడంతో ఒకానొక దశలో తెలుగు టైటాన్స్ 10-1తో నిలిచింది. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికి 16-10తో ఆధిక్యం సాధించిన టైటాన్స్ ద్వితీయార్థంలో కాస్త తడబడినట్లు కనిపించింది.
కానీ చివర్లో పుంజుకున్న టైటాన్స్ తప్పిదాలను తగ్గించుకోవడంతో మ్యాచ్ను 32-24తో గెలుపుగా ముగించగలిగింది. ఈ విజయంతో తెలుగు టైటాన్స్ 24 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







