దక్షిణాఫ్రికాలో సాంస్కృతిక పర్యటన.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- June 12, 2025
దోహా: నోమాస్ సెంటర్ నిర్వహించే 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిల కోసం దక్షిణాఫ్రికాకు సాంస్కృతిక పర్యటన కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ఖతార్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ యాత్ర 2025 ఆగస్టు 1 నుండి 9 వరకు జరగనుంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. రిజిస్ట్రేషన్ రుసుము QR6,000గా నిర్ణయించారు. ఇందులో విమాన ఛార్జీలు, వసతి, రవాణా, వర్క్షాప్ ఫీజులు ఉంటాయని తెలిపారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో అనుబంధంగా ఉన్న నోమాస్ సెంటర్.. పిల్లలను ఖతారీ వారసత్వం, సాంప్రదాయ ఆచారాలకు సంబంధించిన కార్యకలాపాలలో.. సముద్ర సంబంధ కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పర్యటనను చేపడుతున్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం
- IPL 2026: పంజాబ్ పై గుజరాత్ విజయం
- మే మూడో వారంలో సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
- రేపు ఏపీలో భిన్నమైన వాతావరణం!
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- IPL 2026: హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం









