దక్షిణాఫ్రికాలో సాంస్కృతిక పర్యటన.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- June 12, 2025
దోహా: నోమాస్ సెంటర్ నిర్వహించే 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిల కోసం దక్షిణాఫ్రికాకు సాంస్కృతిక పర్యటన కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ఖతార్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ యాత్ర 2025 ఆగస్టు 1 నుండి 9 వరకు జరగనుంది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. రిజిస్ట్రేషన్ రుసుము QR6,000గా నిర్ణయించారు. ఇందులో విమాన ఛార్జీలు, వసతి, రవాణా, వర్క్షాప్ ఫీజులు ఉంటాయని తెలిపారు.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో అనుబంధంగా ఉన్న నోమాస్ సెంటర్.. పిల్లలను ఖతారీ వారసత్వం, సాంప్రదాయ ఆచారాలకు సంబంధించిన కార్యకలాపాలలో.. సముద్ర సంబంధ కార్యకలాపాలలో పాల్గొనేలా చేయడం ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పర్యటనను చేపడుతున్నారు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!







