ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాధితులకు రూ.కోటి నష్ట పరిహారం

- June 12, 2025 , by Maagulf
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాధితులకు రూ.కోటి నష్ట పరిహారం

ముంబై:  విమాన ప్రమాదంపై ఎయిర్‌ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.కోటి పరిహారం ప్రకటించింది.

విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఈ క్షణంలో బాధ వర్ణనాతీతమని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామన్నారు. వారికి అవసరమైన సహకారం అందించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అలాగే, ఈ విమానం కుప్పకూలడంతో ధ్వంసమైన బిజే మెడికల్‌ హాస్టల్‌ నిర్మాణానికి సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com