ఎఱ్ఱ సముద్రములో 31 మంది ఆఫ్రికావాసులని నిలువరించిన సౌదీ అరేబియా

- July 13, 2016 , by Maagulf
ఎఱ్ఱ సముద్రములో 31 మంది ఆఫ్రికావాసులని  నిలువరించిన సౌదీ అరేబియా

రియాద్: ఎఱ్ఱ సముద్రములో 31 మంది ఆఫ్రికా వలసదారులని  సౌదీ అరేబియా సౌదీ సముద్ర గస్తీ దళం  అడ్డగించింది. వీరిలో ఎక్కువమంది సుడాన్ దేశస్థులు వీరు  సౌదీ అరేబియా రాజ్యంలోకి సముద్రంలో చెక్క పడవ ద్వారా చేరుకొనేందుకు యత్నించారని అధికారిక మీడియా మంగళవారం ఇటీవలి వారాల్లో ఇది తాజా కేసుగా  అభివర్ణించింది.

" మా గల్ఫ్.కామ్ " గత నెలరోజులుగా అక్రమ వలస అవరోధాలు ఏర్పరుస్తున్నట్లు నివేదించింది. కాగా, పట్టుబడిన 31 మంది ఆఫ్రికా వలసదారులలో 1/ 3  వంతు మంది మహిళలు ఉన్నారని సరిహద్దు గార్డుల ప్రతినిధి కల్నల్ సాహిర్ అల్ హర్బి తెలిపారు. సేకరించిన  లెక్కల ప్రకారం జూన్ అర్ధ భాగం నుండి  సౌదీ సరిహద్దు గార్డులు అదుపులోనికి తీసుకొన్న అక్రమ ప్రవాసీయుల సంఖ్య 308 మందికి చేరుకొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com