ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్..
- June 22, 2025
ముంబై: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం సీజ్ అయిన సంఘటన కలకలం రేపుతోంది.ఈ అక్రమ రవాణాలో మొత్తం 4.44 కిలోల బంగారంను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.ఈ కేసులో విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల హస్తం ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.
కస్టమ్స్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం, బంగారాన్ని పౌడర్ రూపంలో మార్చి, అది గుర్తించకుండా సాక్సుల్లో దాచి తరలించేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయంలో పనిచేస్తున్న ఉద్యోగులే బంగారం తరలించేందుకు సహకరిస్తున్నారని గుర్తించిన అధికారులు… ఇద్దరు ఉద్యోగులను అరెస్టు విచారిస్తున్నారు.
ఈ ముఠా వెనుక మరెంతమంది ఉన్నారనే దానిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. విమానాశ్రయ సెక్యూరిటీతో పాటు ఇతర సంబంధిత ఏజెన్సీలతో కలిసి మిగతా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'