రేపు కూటమి సర్కార్ తొలి వార్షికోత్సవ సభ
- June 22, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తమ పాలనకు ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రత్యేక సభను నిర్వహించనుంది. “సుపరిపాలనలో తొలి అడుగు” పేరుతో ఈ సభ రేపు సాయంత్రం 4 గంటలకు అమరావతి వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షతో పాటు, గడచిన ఏడాది కాలంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలపై చర్చ జరగనుంది.
పరిపాలనా నిర్ణయాలపై సమీక్ష
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పరిపాలనా నిర్ణయాలపై సమీక్షతోపాటు ప్రజలకు తమ పాలనను వివరించే విధంగా ఈ సమావేశాన్ని రూపొందించారు. ముఖ్యంగా పథకాల అమలులో ఉన్న పారదర్శకత, ప్రజల నెరవేర్పు వంటి అంశాలను ప్రదర్శించనున్నారు.
విమాన ప్రమాదం కారణంగా వాయిదా
ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని జూన్ 12న నిర్వహించాల్సి ఉండగా, అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో వాయిదా పడింది.నూతన తేదీగా రేపు సభను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం తన పాలనకు సంబంధించిన విశ్వసనీయతను ప్రజల ముందు మరింత బలంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









