భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- June 23, 2025
న్యూ ఢిల్లీ: ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ కావడం- గేమ్ఛేంజర్ అవుతుందా? దాడులు చేసిన తర్వాత, ట్రంప్ శాంతిమంత్రం జపించినా, అంతా కూల్ అవుతుందా? ప్రపంచం మీద ఇరాన్ కొత్తగా దాడులు చేయాల్సిన అవసరం లేదు.క్రూడాయిల్ సరఫరా ఆపేస్తామంటే చాలు, మనం హడలిపోతాం. ఎందుకంటే, క్రూడాయిల్ సరఫరాను ఇరాన్ ఆపేస్తే, అంతర్జాతీయంగా సమస్య వస్తుంది.ఒకవైపు హార్ముజ్ జలసంధి మార్గం మూసివేత..మరోవైపు క్రూడాయిల్ నిలిపివేతతో.. ధరలు అమాంతం పెరిగితే, మనదేశంలోనూ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశారు.
ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్కు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదన్నారు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. దేశంలోని చమురు కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయని, వివిధ మార్గాల ద్వారా ఇంధన సరఫరాలు నిరంతరాయంగా అందుతున్నాయన్నారు కేంద్రమంత్రి.
పశ్చిమాసియా ఘర్షణలతో ముడిచమురు గండం
‘‘హార్ముజ్ మార్గం బందైనా భారత్కి ఇబ్బంది లేదు.. వేరే మార్గాల్లో భారత్కు క్రూడాయిల్ వస్తుంది.. 2 మిలియన్ బారెళ్లలోపే హార్ముజ్ గుండా దిగుమతి చేసుకుంటాం..భారత్కు వేరే మార్గాలనుంచి 4 మిలియన్ బారెళ్ల క్రూడాయిల్ వస్తుంది.మన కంపెనీల దగ్గర మూడువారాల నిల్వలు ఉన్నాయి.. ఇతర మార్గాల్లో క్రూడాయిల్ దిగుమతిపై దృష్టి పెడతాం’’..అంటూ కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పేర్కొన్నారు.
మొత్తంగా.. పశ్చిమాసియా ఘర్షణలతో ముడిచమురు గండం ఏర్పడింది.అమెరికా దాడులతో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి..78 డాలర్లకు పైగా బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ట్రేడవుతోంది.. అయితే.. చమురు ధరలు పెరిగితే సామాన్యుడి పై భారం తప్పదని పేర్కొంటున్నారు.ఒకవైపు చర్చలకు అవకాశం ఉందంటూ…మరోవైపు దాడులు చేస్తుండటం అమెరికా వాస్తవ అభిప్రాయాన్ని సందేహాస్పదంగా చేస్తోంది. దీని వెనుక “సైనిక బలంలో తక్కువదనాన్ని ఉపయోగించుకోవాలన్న” వ్యూహం ఉందని విమర్శకుల అభిప్రాయం.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







