ఖతార్ ఎమిర్ తో జీసీసీ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం..!!
- June 25, 2025
దోహా: ఎమిరి దివాన్ లో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, ఇతర గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల విదేశాంగ మంత్రులతో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ దోహాలో సమావేశమయ్యారు. GCC సెక్రటరీ జనరల్ జాస్సిమ్ అల్బుదైవి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా GCC విదేశాంగ మంత్రులు తమ భూభాగంపై ఇరాన్ దురాక్రమణను ఖండించారు. ఖతార్ కు సంఘీభావాన్ని తెలిపారు. ఈ దురాక్రమణ అంతర్జాతీయ చట్టం తోపాటు మంచి నేబర్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అని వారు అన్నారు. ఈ దాడి ఆమోదయోగ్యం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరానిదని వారు స్పష్టం చేశారు. అనంతరం ఉమ్మడి గల్ఫ్ దేశాల పురోగతి, GCC దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మార్గాలపై కూడా అమీర్, విదేశాంగ మంత్రులు చర్చించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







