ఖతార్ ఎమిర్ తో జీసీసీ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం..!!
- June 25, 2025
దోహా: ఎమిరి దివాన్ లో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, ఇతర గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల విదేశాంగ మంత్రులతో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ దోహాలో సమావేశమయ్యారు. GCC సెక్రటరీ జనరల్ జాస్సిమ్ అల్బుదైవి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా GCC విదేశాంగ మంత్రులు తమ భూభాగంపై ఇరాన్ దురాక్రమణను ఖండించారు. ఖతార్ కు సంఘీభావాన్ని తెలిపారు. ఈ దురాక్రమణ అంతర్జాతీయ చట్టం తోపాటు మంచి నేబర్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అని వారు అన్నారు. ఈ దాడి ఆమోదయోగ్యం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరానిదని వారు స్పష్టం చేశారు. అనంతరం ఉమ్మడి గల్ఫ్ దేశాల పురోగతి, GCC దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మార్గాలపై కూడా అమీర్, విదేశాంగ మంత్రులు చర్చించారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







