మొబైల్ కనెక్షన్ ఇ-ఆధార్తో ..
- July 13, 2016
కొత్తగా మొబైల్ కనెక్షన్ తీసుకునేందుకు వ్యక్తిగత, నివాస చిరునామాకు వేర్వేరు ధ్రువీకరణలు సమర్పించాల్సిన పనిలేదు. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి లబించే ఇ-ఆధార్ లేఖ/డౌన్లోడ్ చేసుకున్న కార్డునే మొబైల్ కనెక్షన్ కోసం వ్యక్తిగత, చిరునామా ధ్రువీకరణకు వినియోగించవచ్చని టెలికాం విభాగం స్పష్టం చేసింది. ఇ-ఆధార్ లేఖలో వ్యక్తి పేరు, చిరునామా, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలు నమోదవుతాయని, వాటిని సిమ్కార్డు విక్రయించే వ్యక్తి పరిశీలించాలని సూచించింది. కొనుగోలుదారుకు సంబంధించి యూఐడీఏఐ నుంచి పొందిన వివరాలతో ఇ-ఆధార్ లేఖలోని అంశాలు సరిగా ఉన్నాయని, సిమ్కార్డు విక్రయదారు వాంగ్మూలం నమోదు చేయాలని పేర్కొంది. మొబైల్ కనెక్షన్ల జారీకి ఇ-ఆధార్ లేఖను ధ్రువీకరణగా పరిగణించాలని, ఈ ఏడాది ఆరంభంలో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (కోయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాధ్యూస్, ఆస్పి సెక్రటరీ జనరల్ అశోక్ సూద్ టెలికాం విభాగానికి వినతిపత్రం అందించారు. 'ఆధార్ కార్డుకు, యూఐడీఏఐ వెబ్సైట్ ఇ-ఆధార్ లేఖకు తేడా ఏమీ లేదని, అందువల్ల మొబైల్ కనెక్షన్కు రెండింటినీ అనుమతించాలని' వారు కోరారు. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకుని, యూఐఏడీఐ నుంచి ఇ-ఆధార్ లేఖ పొందిన పలువురికి, ఇప్పటికీ ఆధార్ కార్డు అందలేదు. టెలికాం శాఖ తాజా నిర్ణయం వీరికి ఉపకరిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







