మొబైల్‌ కనెక్షన్‌ ఇ-ఆధార్‌తో ..

- July 13, 2016 , by Maagulf
మొబైల్‌ కనెక్షన్‌ ఇ-ఆధార్‌తో ..

కొత్తగా మొబైల్‌ కనెక్షన్‌ తీసుకునేందుకు వ్యక్తిగత, నివాస చిరునామాకు వేర్వేరు ధ్రువీకరణలు సమర్పించాల్సిన పనిలేదు. ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, యూఐడీఏఐ వెబ్‌సైట్‌ నుంచి లబించే ఇ-ఆధార్‌ లేఖ/డౌన్‌లోడ్‌ చేసుకున్న కార్డునే మొబైల్‌ కనెక్షన్‌ కోసం వ్యక్తిగత, చిరునామా ధ్రువీకరణకు వినియోగించవచ్చని టెలికాం విభాగం స్పష్టం చేసింది. ఇ-ఆధార్‌ లేఖలో వ్యక్తి పేరు, చిరునామా, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలు నమోదవుతాయని, వాటిని సిమ్‌కార్డు విక్రయించే వ్యక్తి పరిశీలించాలని సూచించింది. కొనుగోలుదారుకు సంబంధించి యూఐడీఏఐ నుంచి పొందిన వివరాలతో ఇ-ఆధార్‌ లేఖలోని అంశాలు సరిగా ఉన్నాయని, సిమ్‌కార్డు విక్రయదారు వాంగ్మూలం నమోదు చేయాలని పేర్కొంది. మొబైల్‌ కనెక్షన్ల జారీకి ఇ-ఆధార్‌ లేఖను ధ్రువీకరణగా పరిగణించాలని, ఈ ఏడాది ఆరంభంలో సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (కోయ్‌) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాధ్యూస్‌, ఆస్పి సెక్రటరీ జనరల్‌ అశోక్‌ సూద్‌ టెలికాం విభాగానికి వినతిపత్రం అందించారు. 'ఆధార్‌ కార్డుకు, యూఐడీఏఐ వెబ్‌సైట్‌ ఇ-ఆధార్‌ లేఖకు తేడా ఏమీ లేదని, అందువల్ల మొబైల్‌ కనెక్షన్‌కు రెండింటినీ అనుమతించాలని' వారు కోరారు. ఆధార్‌ కోసం దరఖాస్తు చేసుకుని, యూఐఏడీఐ నుంచి ఇ-ఆధార్‌ లేఖ పొందిన పలువురికి, ఇప్పటికీ ఆధార్‌ కార్డు అందలేదు. టెలికాం శాఖ తాజా నిర్ణయం వీరికి ఉపకరిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com