తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
- June 26, 2025
సికింద్రాబాద్..తిరుమలగిరి ఆర్టిఏ (RTA)కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే ఏసీబీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయానికి చేరుకుని ఏజెంట్లు చేస్తున్న దందాను పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఏజెంట్ల పై పక్కా నిఘా ఉంచిన ఏసీబీ బృందాలు 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.ఏజెంట్ల నుండి నగదు, పలు వాహన ధ్రువీకరణ పత్రాలు, సెల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు దొరికాయని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.
ఏజెంట్ల ఫోన్లను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు .ఆర్టీవో సిబ్బందిపై కూడా పలు ఆరోపణలు ఉన్న నేపధ్యంలో వారిని కూడా విచారిస్తామని అన్నారు. ఆర్టీవో ను కూడా అన్ని కోణాలలో విచారించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఒక్కో ఏజెంట్ దగ్గర 50 వాహన దృవీకరణ పత్రాలు ఉన్నట్లు నిర్ధారణ అన్నకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. రాత్రి వరకు ఏసీబీ సోదాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







