పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన సౌదీ అరేబియా..!!
- June 29, 2025
రియాద్: ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనా పౌరులపై కొనసాగిస్తున్న హింసను సౌదీ అరేబియా ఖండించింది. వెస్ట్ బ్యాంక్లోని రామల్లా తూర్పున ఉన్న కాఫర్ మాలిక్ గ్రామంలో ఇటీవల జరిగిన దాడులను మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది.
గాజాలో నిరాయుధ పౌరులపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దమకకాండను, నిరాశ్రయులకు నివాసంగా ఉన్న పౌర స్థలాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. పాలస్తీనా పౌరులకు రక్షణ కల్పించడానికి, వారి చట్టబద్ధమైన హక్కులన్నింటినీ వినియోగించుకోవడానికి వీలు కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉందని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఇజ్రాయెల్ ఉల్లంఘించడాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాలని మరోసారి పిలుపునిచ్చింది.
బుధవారం సాయంత్రం దాదాపు 100 మంది ఇజ్రాయెల్ వలసదారులు గ్రామంపై దాడి చేసి ముగ్గురు పాలస్తీనియన్లను కాల్చి చంపారు. కాఫర్ మాలిక్ వాసులు రక్షణ కోసం, వారిని వెనక్కి తరిమికొట్టే ప్రయత్నంలో రాళ్ళు విసిరారు. కానీ, వారికి తోడుగా వచ్చిన ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనియన్లపై కాల్పులు జరిపింది.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







