హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- February 10, 2026
హైదరాబాద్: భారతదేశ ఐటీ, వ్యాపార రంగాలకు భారీ ప్రోత్సాహం ఇస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికన్ హోల్సేల్ రిటైలర్లలో ఒకటైన కాస్ట్కో హోల్సేల్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశంలో వేగంగా విస్తరిస్తున్న కార్పొరేట్, టెక్నాలజీ ఎకోసిస్టమ్పై కంపెనీ పెట్టుబడులకు తొలి పెద్ద సూచికగా భావిస్తున్నారు. ఈ హైదరాబాద్ కేంద్రం.. కాస్ట్కోకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టోర్ల మాదిరిగా సాధారణ రిటైల్ గిడ్డంగిగా పనిచేయదు. బదులుగా, ఇది ఒక అధునాతన టెక్నాలజీ, పరిశోధన హబ్ గా వ్యవహరిస్తుంది. టెక్నాలజీ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, డిజిటల్ సిస్టమ్స్, బ్యాక్-ఎండ్ ఆపరేషన్స్ వంటి కీలక రంగాల్లో కాస్ట్కో యొక్క గ్లోబల్ కార్యకలాపాలకు ఇది మద్దతు అందించనుంది. దీంతో హైదరాబాద్.. కాస్ట్కో అంతర్జాతీయ నెట్వర్క్లో ఒక ముఖ్యమైన నోడ్గా మారనుంది. ప్రారంభ దశలోనే ఈ GCC ద్వారా సుమారు 1,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నారు.
వ్యాపార అవసరాలు, గ్లోబల్ కార్యకలాపాల విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తులో ఉద్యోగాల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి హై-స్కిల్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంచనా. కాస్ట్కో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక భారతదేశంలోని ప్రతిభావంతులైన యువత, సాంకేతిక నైపుణ్యాలు, అలాగే హైదరాబాద్ నగరం అందిస్తున్న మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషించాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ వంటి గ్లోబల్ దిగ్గజ సంస్థలు తమ టెక్, రీసెర్చ్ కేంద్రాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం వల్ల, ఈ నగరం గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా గుర్తింపు పొందింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఏరియాలో భూమి కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు.. కారణం ఏంటంటే.. కాస్ట్కో ప్రవేశం కేవలం ఉద్యోగాల సృష్టికే పరిమితం కాకుండా, హైదరాబాద్ను బహుళజాతి సాంకేతిక, పరిశోధనా కేంద్రాలకు ప్రాధాన్య గమ్యస్థానంగా మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







