చైనా, తైవాన్ లకు షాకిచ్చిన సౌదీ అరేబియా..!!
- June 30, 2025
రియాద్: చైనా, తైవాన్ నుండి దిగుమతయ్యే స్టెయిన్లెస్ స్టీల్ పైపులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు సౌదీ వాణిజ్య మంత్రి, జనరల్ అథారిటీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (GAFT) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ మజేద్ అల్-కసాబి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
జూన్ 30 నుండి ఐదు సంవత్సరాల పాటు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఆయా ఉత్పత్తుల దిగుమతులపై 6.5 శాతం నుండి 27.3 శాతం వరకు ఫైనల్ యాంటీ-డంపింగ్ సుంకాలను విధించి వసూలు చేయాలని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీని మంత్రి అల్-కసాబి ఆదేశించారు.
స్థానిక పరిశ్రమను రక్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య నివారణల చట్టం ప్రకారం.. తుది డంపింగ్ వ్యతిరేక సుంకాలను నిర్ణయించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!







