చైనా, తైవాన్ లకు షాకిచ్చిన సౌదీ అరేబియా..!!
- June 30, 2025
రియాద్: చైనా, తైవాన్ నుండి దిగుమతయ్యే స్టెయిన్లెస్ స్టీల్ పైపులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు సౌదీ వాణిజ్య మంత్రి, జనరల్ అథారిటీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (GAFT) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ మజేద్ అల్-కసాబి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
జూన్ 30 నుండి ఐదు సంవత్సరాల పాటు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఆయా ఉత్పత్తుల దిగుమతులపై 6.5 శాతం నుండి 27.3 శాతం వరకు ఫైనల్ యాంటీ-డంపింగ్ సుంకాలను విధించి వసూలు చేయాలని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీని మంత్రి అల్-కసాబి ఆదేశించారు.
స్థానిక పరిశ్రమను రక్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య నివారణల చట్టం ప్రకారం.. తుది డంపింగ్ వ్యతిరేక సుంకాలను నిర్ణయించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







