చైనా, తైవాన్ లకు షాకిచ్చిన సౌదీ అరేబియా..!!
- June 30, 2025
రియాద్: చైనా, తైవాన్ నుండి దిగుమతయ్యే స్టెయిన్లెస్ స్టీల్ పైపులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు సౌదీ వాణిజ్య మంత్రి, జనరల్ అథారిటీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (GAFT) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ మజేద్ అల్-కసాబి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
జూన్ 30 నుండి ఐదు సంవత్సరాల పాటు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఆయా ఉత్పత్తుల దిగుమతులపై 6.5 శాతం నుండి 27.3 శాతం వరకు ఫైనల్ యాంటీ-డంపింగ్ సుంకాలను విధించి వసూలు చేయాలని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీని మంత్రి అల్-కసాబి ఆదేశించారు.
స్థానిక పరిశ్రమను రక్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య నివారణల చట్టం ప్రకారం.. తుది డంపింగ్ వ్యతిరేక సుంకాలను నిర్ణయించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!