చైనా, తైవాన్ లకు షాకిచ్చిన సౌదీ అరేబియా..!!
- June 30, 2025
రియాద్: చైనా, తైవాన్ నుండి దిగుమతయ్యే స్టెయిన్లెస్ స్టీల్ పైపులపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు సౌదీ వాణిజ్య మంత్రి, జనరల్ అథారిటీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (GAFT) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ మజేద్ అల్-కసాబి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
జూన్ 30 నుండి ఐదు సంవత్సరాల పాటు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఆయా ఉత్పత్తుల దిగుమతులపై 6.5 శాతం నుండి 27.3 శాతం వరకు ఫైనల్ యాంటీ-డంపింగ్ సుంకాలను విధించి వసూలు చేయాలని జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీని మంత్రి అల్-కసాబి ఆదేశించారు.
స్థానిక పరిశ్రమను రక్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య నివారణల చట్టం ప్రకారం.. తుది డంపింగ్ వ్యతిరేక సుంకాలను నిర్ణయించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









