అబుదాబిలోని ఈ బీచుల్లో స్విమ్మింగ్ చేయడం ప్రమాదకరం..!!
- June 30, 2025
యూఏఈ: అబుదాబిలోని నివాసితులు, సందర్శకులు తీరప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలలో స్విమ్మింగ్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. అల్ బహియా సముద్రం నుండి అల్ షాలిలా ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిషేధిత తీర ప్రాంతాలలో ఈతకు దూరంగా ఉండాలని మునిసిపాలిటీలు, రవాణా శాఖతో పాటు అధికారులు ప్రజలను కోరారని తెలిపారు.
ఆలల తీవ్రత అధికంగా ఉండటంతోపాటు నీటి అడుగున అడ్డంకులు ఉండటం వంటి అనేక కారణాల వల్ల, రెస్క్యూ బృందాలు లేకపోవడంతో పాటు ఈ ప్రదేశాలు ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారవచ్చని తెలిపారు. ఈత కొట్టడం వల్ల మునిగిపోవడం లేదా గాయపడే అవకాశాలు ఉంటాయని అధికారులు హెచ్చరించినందున, ఈత కొట్టకుండా చూసుకోవడానికి ఈ ప్రాంతాలలో స్పష్టమైన హెచ్చరిక బోర్డులను పెట్టినట్టు తెలిపారు.
ఈ ప్రాంతాల్లో పిల్లలు ఈత కొట్టకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుటుంబాలు తమ పిల్లలను రక్షణకు లైఫ్గార్డ్ స్టేషన్లు అందుబాటులో ఉన్న నియమిత ప్రాంతాలలో మాత్రమే ఈత కొట్టించాలని సూచించారు.
గత సంవత్సరం, దుబాయ్లోని అల్ మమ్జార్ బీచ్ నుండి ఈత కొడుతుండగా బలమైన ఆలలలో చిక్కుకుని 15 ఏళ్ల భారతీయ ప్రవాసి మునిగిపోయాడు. 2022లో, అబుదాబిలోని ఒక దీవుల బీచ్లో 31 ఏళ్ల వ్యక్తి ఈత కొడుతుండగా మునిగిపోయి మరణించాడు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







