ఇరాన్తో అణు ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నాయి: ఖతార్
- July 01, 2025
దోహా: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో మిడిలీస్ట్ లో ఉద్రిక్తత ముగిసిన తర్వాత, ఇరాన్ అణు ఫైలుపై ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలలో ఖతర్ తీవ్రంగా ప్రయత్నస్తుందని ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ అల్-అన్సారీ తెలిపారు.
అయితే, గాజాలో కాల్పుల విరమణ గురించి ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. "ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రయోజనాలతో పాటు, ఖతర్ ఆసక్తి ఇప్పుడు ఇరాన్ -యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య విస్తృత అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వైపు మళ్ళించాము." అని అన్నారు. అణు ఒప్పందం విషయంలో వివిధ పార్టీలతో ఖతార్ ప్రతిరోజూ సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రస్తుత ఇజ్రాయెల్ సైన్యం కారణంగా గాజాలో జరుగుతున్న మానవతా విపత్తును అల్-అన్సారీ ఖండించారు. "ఈ సంక్షోభం దాదాపు రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీనికి ఒక పరిష్కారాన్ని చూపాల్సి బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉంది." అని పేర్కొన్నారు. గాజాపై చర్చలను తిరిగి ప్రారంభించడం కోసం అమెరికాను ఒప్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









