ఇరాన్తో అణు ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నాయి: ఖతార్
- July 01, 2025
దోహా: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో మిడిలీస్ట్ లో ఉద్రిక్తత ముగిసిన తర్వాత, ఇరాన్ అణు ఫైలుపై ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలలో ఖతర్ తీవ్రంగా ప్రయత్నస్తుందని ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ అల్-అన్సారీ తెలిపారు.
అయితే, గాజాలో కాల్పుల విరమణ గురించి ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. "ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రయోజనాలతో పాటు, ఖతర్ ఆసక్తి ఇప్పుడు ఇరాన్ -యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య విస్తృత అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వైపు మళ్ళించాము." అని అన్నారు. అణు ఒప్పందం విషయంలో వివిధ పార్టీలతో ఖతార్ ప్రతిరోజూ సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రస్తుత ఇజ్రాయెల్ సైన్యం కారణంగా గాజాలో జరుగుతున్న మానవతా విపత్తును అల్-అన్సారీ ఖండించారు. "ఈ సంక్షోభం దాదాపు రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీనికి ఒక పరిష్కారాన్ని చూపాల్సి బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉంది." అని పేర్కొన్నారు. గాజాపై చర్చలను తిరిగి ప్రారంభించడం కోసం అమెరికాను ఒప్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







