ఇరాన్తో అణు ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతున్నాయి: ఖతార్
- July 01, 2025
దోహా: ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో మిడిలీస్ట్ లో ఉద్రిక్తత ముగిసిన తర్వాత, ఇరాన్ అణు ఫైలుపై ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలలో ఖతర్ తీవ్రంగా ప్రయత్నస్తుందని ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మజేద్ బిన్ మొహమ్మద్ అల్-అన్సారీ తెలిపారు.
అయితే, గాజాలో కాల్పుల విరమణ గురించి ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. "ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రయోజనాలతో పాటు, ఖతర్ ఆసక్తి ఇప్పుడు ఇరాన్ -యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య విస్తృత అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం వైపు మళ్ళించాము." అని అన్నారు. అణు ఒప్పందం విషయంలో వివిధ పార్టీలతో ఖతార్ ప్రతిరోజూ సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ప్రస్తుత ఇజ్రాయెల్ సైన్యం కారణంగా గాజాలో జరుగుతున్న మానవతా విపత్తును అల్-అన్సారీ ఖండించారు. "ఈ సంక్షోభం దాదాపు రెండు సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీనికి ఒక పరిష్కారాన్ని చూపాల్సి బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉంది." అని పేర్కొన్నారు. గాజాపై చర్చలను తిరిగి ప్రారంభించడం కోసం అమెరికాను ఒప్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









