‘హదత’ను ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- July 02, 2025
మస్కట్: సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU) సహకారంతో ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ‘హదత’ అనే సైబర్ భద్రతా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం సైబర్ భద్రతా రంగంలో పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధిని ప్రోత్సహించనుంది. జాతీయ ఆవిష్కరణలకు ఇది కేంద్రంగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అలీ బిన్ అమెర్ అల్ షిధాని తెలిపారు.
ఈ సందర్భంగా “హదత” సైబర్ భద్రతా కేంద్రం గురించిన వివరాలను ప్రదర్శించారు. “హదాతా” ద్వారా అరబ్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఒమన్ కీలక ముందడుగు వేసిందని వక్తలు కొనియాడారు. సాంకేతిక పెట్టుబడులను పెంచడం, సాంకేతికతలను స్థానికీకరించడం, ఒమానీ యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ కేంద్రం పనిచేస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







