‘హదత’ను ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- July 02, 2025
మస్కట్: సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU) సహకారంతో ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ‘హదత’ అనే సైబర్ భద్రతా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం సైబర్ భద్రతా రంగంలో పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధిని ప్రోత్సహించనుంది. జాతీయ ఆవిష్కరణలకు ఇది కేంద్రంగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అలీ బిన్ అమెర్ అల్ షిధాని తెలిపారు.
ఈ సందర్భంగా “హదత” సైబర్ భద్రతా కేంద్రం గురించిన వివరాలను ప్రదర్శించారు. “హదాతా” ద్వారా అరబ్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఒమన్ కీలక ముందడుగు వేసిందని వక్తలు కొనియాడారు. సాంకేతిక పెట్టుబడులను పెంచడం, సాంకేతికతలను స్థానికీకరించడం, ఒమానీ యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ కేంద్రం పనిచేస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









