‘హదత’ను ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- July 02, 2025
మస్కట్: సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU) సహకారంతో ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ‘హదత’ అనే సైబర్ భద్రతా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం సైబర్ భద్రతా రంగంలో పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధిని ప్రోత్సహించనుంది. జాతీయ ఆవిష్కరణలకు ఇది కేంద్రంగా పనిచేస్తుందని మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అలీ బిన్ అమెర్ అల్ షిధాని తెలిపారు.
ఈ సందర్భంగా “హదత” సైబర్ భద్రతా కేంద్రం గురించిన వివరాలను ప్రదర్శించారు. “హదాతా” ద్వారా అరబ్ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ రంగంలో ఒమన్ కీలక ముందడుగు వేసిందని వక్తలు కొనియాడారు. సాంకేతిక పెట్టుబడులను పెంచడం, సాంకేతికతలను స్థానికీకరించడం, ఒమానీ యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ కేంద్రం పనిచేస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









