సౌదీ అరేబియాలో వర్కర్లకు థార్డ్ ఫేజ్ 'ఈ-ట్రాన్స్ ఫర్' ప్రారంభం..!!
- July 02, 2025
రియాద్: డిజిటల్ వాలెట్ల ద్వారా గృహ కార్మికులకు ఎలక్ట్రానిక్ జీతం బదిలీ సేవ మూడవ దశ జూలై 1 నుండి అమల్లోకి వచ్చిందని సౌదీ అరేబియా మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మూడవ దశ ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ గృహ కార్మికులను కలిగి ఉన్న యజమానులకు వర్తిస్తుందని తెలిపారు.
ఈ సంవత్సరం జనవరి 1న నలుగురు కంటే ఎక్కువ గృహ కార్మికులను కలిగి ఉన్న యజమానులకు రెండవ దశ అమలు చేశారు. గృహ కార్మికుల సాలరీలను 3వ దశ ఈ-బదిలీ వ్యవస్థను మంత్రిత్వ శాఖ దశలవారీగా అమలు చేస్తోంది. అక్టోబర్ 1 నుండి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్నవారికి ఇ-బదిలీ సాలరీ సేవ వర్తిస్తుంది. జనవరి 1, 2026 నాటికి అన్ని గృహ కార్మికులను ఈ కొత్త ప్రక్రియలో చేర్చుతారు.
ఈ చొరవ గృహ కార్మికుల జీతాలకు సంబంధించి వారి హక్కులకు హామీ ఇవ్వడం, గృహ కార్మికుల రంగాన్ని అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందన్నారు. యజమానులు, గృహ కార్మికుల హక్కులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది. ముసానెడ్ ప్లాట్ఫామ్ ద్వారా డిజిటల్ వాలెట్లు, ఆమోదించబడిన బ్యాంకుల ద్వారా దీనిని అమలు చేస్తున్నారు.దీని ద్వారా కార్మికులు అధికారిక మార్గాల ద్వారా నేరుగా తన దేశంలోని కుటుంబానికి జీతం పంపడానికి వీలు కల్పిస్తుందన్నారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







